హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. వీక్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం కూడా లాభించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 58,461కి చేరుకుంది. నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 17,401కి ఎగబాకింది.
Mon Jan 19, 2015 06:51 pm