హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఓ బీఎస్పీ నేత బోరున విలపించారు. పార్టీ కోసం 24 ఏండ్లగా ఎంతో కష్టపడ్డ నాకు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కలేదని అర్షద్ రాణా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం హోర్డింగ్లు కూడా కట్టానని.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. ముజఫుర్నగర్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సతీశ్ కుమార్ను కలిస్తే.. రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని అడిగినట్లు ఆరోపించారు రాణా. ఇప్పటికే రూ. 4.5 లక్షలు ఇచ్చానని చెప్పారు. రాణా విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm