తిరుపతి: తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి వింత అనుభవం ఎదురైంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి స్వయంగా ఎంపీనే డబ్బులు డిమాండ్ చేయడం కలకలం రేపుతుంది. సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్న అభిషేక్గా తనను తాను పరిచయం చేసుకున్న వ్యక్తి.. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద రూ. 5కోట్లు మంజూరైనట్టు తెలిపాడు. మంజూరైన రుణాలు విడుదల చేయాలంటే 25 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 1.5లక్షలు వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో ఎంపీ గరుమూర్తి సీఎంఓ కార్యాలయాన్పి సంప్రదించారు. అలాంటి వ్యక్తి ఎవరూ సీఎంఓలో లేరని తెలుసుకున్న ఎంపీ ఈ విషయం పై అర్బన్ జిల్లా ఎస్పీకీ ఎంపీ పీఏ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా తన వివరాలను ఎంపీకి పంపిన సైబర్ చీటర్ అభిషేక్ ను పట్టుకునే పనిలో నిమగ్నమైన అర్బన్ జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ప్రజలను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm