హైదరాబాద్: మధ్యప్రదేశ్లో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ ఆశచూపి ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి చేసి అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన శివపురి జిల్లా తెందువా పోలీస్స్టేషన్ పరిధిలోని ఇమాలియా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇమాలియా గ్రామానికి చెందిన ఉత్తమ్ నారాయణ్(35) పక్కింట్లో ఒంటరిగా ఉన్న బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలికపై లైంగికదాడి చేసి ఆ తర్వాత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఉన్న గోధుమ కంటైనర్లో పడేశాడు.
కొద్దిసేపటి తర్వాత.. బాలిక తల్లిదండ్రులు ఇంటివద్దకు వచ్చి చిన్నారిని వెతికారు. ఆచూకీ దొరక్కపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. గోధుమ కంటైనర్లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నింధితుడు ఉత్తమ్ నారాయణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 01:16PM