హైదరాబాద్ : కరోనా కేసులు విజృంభిస్తుండడంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు అన్ని కోర్టులు ఆన్లైన్లోనే కేసుల నిర్వహణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, హైకోర్టులోని అన్ని బెంచ్లు ఆన్లైన్లోనే కేసుల విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. కేసుల తీవ్రతకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm