హైదరాబాద్ : కరోనా పరీక్షల విషయమై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం లేఖ రాసింది. కోవిడ్ పరీక్షల నిర్వహణ తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి జాడను సమర్ధవంతంగా తెలుసుకుని, వ్యాధి విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ పరీక్షలను పెంచాలని కేంద్రం ఆదేశించింది. తక్షణ చర్యల్లో భాగంగా కొత్త క్లస్టర్లు, హాట్స్పాట్లు గుర్తించాలని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. జనవరి 10న ఐసీఎంఆర్ జారీ చేసిన టెస్టింగ్ స్ట్రాటజీని అనుసరించాలని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm