హైదరాబాద్ : దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. తాజాగా ఈ కరోనా వేరియంట్ దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని దీనిపై పరిశోధన జరిపిన ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వేరియంట్ విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కంటే దేశీయ వ్యాప్తే అధికంగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికుల్లో ఈ వేరియంట్ను తొలుత గుర్తించారని తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో చాలా మందికి లక్షణాలు కనపడడం లేదని తెలిపింది...కొందరిలో స్వల్ప లక్షణాలు కనపడుతున్నట్లు పేర్కొంది. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నా ఆస్పత్రులలో చేరాల్సిన అవసరం తక్కువేనని చెప్పింది. అయినప్పటికీ ఒమిక్రాన్ను నిర్లక్ష్యం చేయకూడదని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీ, ముంబైలో అధికంగా ఉందని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm