న్యూజెర్సీ : ఓ రెండేండ్ల బాలుడు ఏకంగా రూ. లక్షా 27 వేలు( (1700 డాలర్లు) ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రమోద్ కుమార్-మధులు ఇటీవల సొంతిల్లు కొనుక్కున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని అనుకున్నారు. వాల్మార్ట్ యాప్లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. కొన్నింటిని కార్ట్లో యాడ్ చేశారు. నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని భావించారు. అయితే ఓ రోజు వాల్మార్ట్ నుంచి ఫర్నిచర్ పార్సిల్స్ రావడంతో వారికి అర్థం కాలేదు. ఏమైందా అని ఆరా తీస్తే.. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు స్మార్ట్ఫోన్ తీసుకున్న దంపతుల రెండేండ్ల కుమారుడు అయాన్ష్ వాల్ మార్ట్ యాప్ ఓపెన్ చేసి, కార్ట్లో యాడ్ చేసున్న వాటినన్నింటినీ ఆర్డర్ చేశాడని, రూ. లక్షా 27 వేలు పేమెంట్ కూడా చెల్లించినట్టు తేలింఇ. దాంతో తమ కుమారుడి వల్ల పొరపాటు జరిగిందంటూ వారు వాల్మార్ట్కు తెలిపారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సంస్థ అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm