అమరావతి : గురుకుల పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.యం.పురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ యం పురం గురుకుల పాఠశాలలో వంశీ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే అతను ఉన్నట్టుంది ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ కొట్టడం వలనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు
Mon Jan 19, 2015 06:51 pm