హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారు అంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని అడిగింది. అయితే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వివరణ ఇచ్చారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని సూచించింది.
మరోవైపు ఆన్లైన్ ద్వారా విచారణకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని తెలిపారు. 77 లక్షల ఇండ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు కోర్టుకు తెలపగా.. పిల్లలకు మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ శ్రీనివాసరావు అందుకు సమాధానం ఇచ్చారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 12:51PM