నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనల పై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని అన్నారు. మంత్రి నియోజకవర్గం లోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుమన్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా తొర్తి గ్రామంలో ఆధిపత్య మున్నూరు కాపు వర్గం మాల, మాదిగలకు బహిష్కరణ విధించి వారికి ఇతర కులాలు అండగా ఉన్నందున ఆ ఇతర కులాల అన్నింటిని సాంఘిక బహిష్కరణ విధించి సపరేటు గా వైన్స్ ,కూల్ డ్రింక్స్, టీవీ డిష్ లను ఏర్పాటు చేయించి ఆటోలలో తమ వర్గం వారు ఎక్కకుండా ఆంక్షలు విధించి, గొర్లు తమ భూముల్లోకి మేతకు రాకుండా ,గంగపుత్రుల వాళ్ళ చేపలు కొనకుండా, వడ్ల కమ్మరుల కు పని ఇవ్వకుండా ఇలా అనేక కులవృత్తుల వాళ్లకు పని ఇవ్వకుండా కొనకుండా బహిష్కరణ చేసి, ఒకవేళ మీకు పని ఇవ్వాలన్న, కొనాలన్నా మాల, మాదిగల తో మీరు దూరంగా ఉంటే మాతో కలిసి వస్తేనే మిమ్మల్ని కలుపుకుంటామని ఆంక్షలు విధిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై స్థానిక అధికారుల వద్దకు వెళితే వాళ్లను మేనేజ్ చేస్తూ కాలయాపన చేస్తూ కేసులు నమోదు కాకుండా లాబీయింగ్ చేస్తున్నారని వారు అన్నారు. మంత్రి సొంత నియోజకవర్గమైన తొర్తి గ్రామంలో రెండు నెలలుగా బహిష్కరణ కొనసాగుతుంటే దాని పరిష్కారానికై స్పందించక పోవడం విచారకరమని ఇప్పటికైనా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినని పక్షంలో చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిషన్, ఉపాధ్యక్షులు మారుతి గౌడ్, సహాయ కార్యదర్శి ఆల్గోటు సాయిలు, కోశాధికారి నారాయణ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2022 06:08PM