నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్ర శివారులో ఉన్న పుణ్య క్షేత్రం దక్షిణకాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో ఉన్న కోడెలకు ట్రాక్టరు గడ్డిని సిద్ది రామేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, ఎంపీటీసీ మీనా దుర్గ బాబు ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి కి శనివారం అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కోడెలకు తమ వంతుగా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీధర్, ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2022 06:31PM