హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని కోచింగ్ కోసం నగరానికి వస్తున్న నిరుద్యోగ యువతీయువకులను చిక్కడపల్లి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసేవారున్నారని, ఎవరైనా అలా ఇప్పిస్తామంటే గుడ్డిగా నమ్మకుండా దగ్గరలోని పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm