- మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం
- ప్రసంగం ఆద్యంతం అబద్ధాలే
హైదరాబాద్: కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన సందర్భంగా తుక్కుగూడ సభలో బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇస్తే పాలమూరు-రంగారెడ్డి, ఆర్డిఎస్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడంతో పాటు మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఇది ప్రజలలో మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం. ఇది తీవ్ర ఆక్షేపణీయం.
గత 8ఏళ్ళుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలేవీ అమలు చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్రంలో ఉన్న 8 లక్షల ఖాళీలు భర్తీ మాటెత్తకుండా తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తాననడం హాస్యాస్పదం. ఇప్పుడు రాష్ట్రంలో అవకాశం ఇస్తే ఏదో ఒరగబెడతామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. వీటిని చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2022 06:47PM