హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయం వద్ద 28 రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన లావణ్య గత నాలుగు రోజుల నుంచి తన ఇద్దరు కుమారులతో కలిసి ఆలయం వద్ద ఉంటోంది.
అయితే ఆదివారం రాత్రి ఆమె వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం తాగించారు. లావణ్య నిద్రలోకి జారుకోగా పసికందును కిడ్నాప్ చేశారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 12:44PM