న్యూఢిల్లీ : ఢిల్లీలో 80 శాతం ఆక్రమణలే ఉన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాజాగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రజల షాపులు, ఇండ్లను బీజేపీ బుల్డోజర్లతో కూల్చివేయడం సరికాదన్నారు. స్వతంత్ర భారత్ లో దీన్ని అతిపెద్ద విధ్వంసంగా పేర్కొన్నారు. 63 లక్షల మంది ప్రజల ఇండ్లు, షాపులు బుల్డోజర్ల కారణంగా కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని.. ఒకటి ఢిల్లీలో 80 శాతం ఆక్రమణల పరిధిలోకే వస్తోందన్నారు. అలాగే ప్రజలు పేపర్లు చూపించిన తర్వాత కూడా బుల్డోజర్లతో కూల్చేస్తుండడం రెండో అంశమని పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతి కాలనీలు, మురికివాడలను తొలగించాలన్నది వారి ఆలోచన అని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm