హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పెట్ ఔటర్ రింగురోడ్డు వద్ద భారీగా గంజాయిని హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ గోదావరి ఏజన్సీ ఏరియా నుండి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. 10 మంది సభ్యులు గల గంజాయి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. ఔటర్ రింగురోడ్డు సమీపంలో గంజాయిని ఓ కారులో నుండి మరో కారులోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 470 కేజీల గంజాయి, నాలుగు కార్లు, 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm