హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారంను పట్టుకున్నారు బార్డర్ సెక్యూరిటీ బలగాలు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. నార్త్ 24 పరగణాల జిల్లాలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ లోని బెనాపోల్ నుంచి భారత్ కు తిరిగివస్తున్న ట్రక్కును తనిఖీ చేయగా బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. బంగారం విలువ సుమారు 6 కోట్లు ఉంటుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm