బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రయివేటు పాఠశాల ఆవరణ, దాని చుట్టుపక్కల వీధుల్లో ఎరుపు రంగులో 'సారీ.. సారీ.. సారీ` అనే రాయడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను, పాఠశాల అధికారులను ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని సుంకడకట్టే ప్రాంతంలో శాంతిధామ పాఠశాల ప్రవేశ ద్వారం, గోడలు, మెట్లపై సారీ.. సారీ.. సారీ అని కొందరు ఆకతాయిలు రాశారు. చుట్టుపక్కల వీధుల్లో అలాగే రాశారు. స్థానికులు సమాచారం అందించిగా.. పోలీసులు అక్కడకు చేరుకుని . సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి.. కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఇద్దరూ సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్లు ఉపయోగించే పెద్ద బ్యాగ్ని మోస్తూ కనిపించారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Mon Jan 19, 2015 06:51 pm