అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లాలో అల్లర్లను నిరసిస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆందోళనను చేపట్టనున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీపీసీసీ చీఫ్ శైలజనాథ్తో పాటు ఎస్సీ విభాగం చైర్మన్ వినయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ... కోనసీమలోని మతోన్నాదులు అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మంత్రి ఇంటిపై దాడి జరిగిన తీరు అనుమానాలకు తావిస్తోందని తెలపారు. అమలాపురం అల్లర్లను వైసీపీ నేతలే ప్రోత్సహించారనేది వాస్తవమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm