అమరావతి : పెండ్లి వాహనం బోల్తా పడి నలుగురు మృతి చెందారు. అలాగే పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కాశానగర్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 మందికి పైగా మందితో ఓ పెండ్లి వ్యాన్ చింతలమడ నుంచి మోపిదేవి వెళ్తున్నది. అయితే ప్రమాదవశాత్తు కాశానగర్ వద్ద వ్యాన్ బోల్దా పడింది. దాంతో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm