మహబూబ్ నగర్: బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామాని కి చెందిన ఓ బాలిక (15) ఇంట్లో ఎవరు లేని సమయంలో నిప్పంటించుకొని అత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చే సుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్న సమయంలో ఎగిసి పడుతున్న మంటల్లో కాలు తూ కేకలు పెడుతూ బయటకు వచ్చిన బాలికను చుట్టుప క్కల వారు గమనించి వెంటనే 108లో నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. చికిత్స పొందుతున్న బాలిక అధికారులకు వాంగ్మూలం ఇస్తూ తాను గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించగా అతడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు పేర్కొన్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm