హైదరాబాద్ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వ్యవసాయం, గ్రామీణాబివృద్ధిపై మక్కువ ఎక్కువ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాని ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు దశాబ్దాలుగా దేశానికి విశేష సేవలందించారని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఆయన నేటి ప్రజలకు ప్రేరణ అన్నారు. వెంకయ్య నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm