న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ను ఆరు నెలలకు తగ్గించింది. గతంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్కు, బూస్టర్ డోస్కు మధ్య తొమ్మిది నెలల గ్యాప్ ఉండేది. అయితే సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని వ్యాక్సినేషన్పై సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సూచించింది. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇప్పుడు ఆరు నెలలు లేదా 26 వారాలకు తగ్గించారు. 18 నుంచి 59 ఏండ్ల వారు సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm