హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 76,681 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 40,109 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.38 కోట్లు వచ్చినట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm