నవతెలంగాణ నంద్యాల: త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ రామకృష్ణ స్టేషన్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి కొన్ని నెలల క్రితమే ఆళ్ళగడ్డ నుంచి నంద్యాలకు బదిలీ అయింది. పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా? లేక కుటుంబ సమస్యలేమైనా ఉన్నాయా? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm