హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 13 నుంచి 2023 ఫిబ్రవరి 14 వరకు ప్రతి మంగళవారం షోలాపూర్ నుంచి ముంబయి ఎల్టీటీకి (01435), డిసెంబర్ 14 నుంచి 2023 ఫిబ్రవరి 15 వరకు ప్రతి బుధవారం ముంబయి ఎల్టీటీ నుంచి షోలాపూర్కు (01436), డిసెంబర్ 15 నుంచి 2023 ఫిబ్రవరి 16 వరకు ప్రతి గురువారం షోలాపూర్ నుంచి తిరుపతి వరకు (01437), డిసెంబర్ 16 నుంచి 2023 ఫిబ్రవరి 17 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి షోలాపూర్ వరకు ప్రత్యేక రైళ్లను (01438) నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm