హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. సమావేశాలకు సహకరించాల్సిందిగా ప్రభుత్వం పార్టీలను కోరనున్నట్టు తెలుస్తోంది. అఖిలపక్షాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మార్గాని భరత్, తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, టీఆర్ఎస్ తరపున కేశవరావు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm