నవతెలంగాణ ఖమ్మం: వైఎస్ షర్మిల ముమ్మాటికీ బీజేపీ వదిలిన బాణమేనని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల మాట్లాడుతున్న భాష, వ్యాఖ్యలు, చేస్తున్న విమర్శలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె పాదయాత్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదని ఆన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐటీ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల తరువాత పొడు, ధరణి, అసంఘటిత సమస్యల పై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm