హైదరాబాద్: టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటున్న సందర్భంలో బీజేపీ కీలకమైన సదస్సుకు హైదరాబాద్ను వేదికగా చేసుకున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గ విస్తారక్ (పూర్తి స్థాయి కార్యకర్తలు)ల శిక్షణ సదస్సు నిర్వహించనుంది. దక్షిణాదిలో 80 లోక్సభ నియోజకవర్గాల విస్తారక్లు పాల్గొనే ఈ సదస్సుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు సునీల్ బన్సల్, తరుణ్ఛుగ్ హాజరవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm