నవతెలంగాణ అహ్మదాబాద్: గుజరాత్ ప్రజలు బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని సొంతం చేసుకున్నది. నమోదైన మొత్తం ఓట్లలో 53 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. అయితే రాష్ట్రంలో నోటాకు కూడా భారీగా ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. ఇది మొత్తం నమోదైన పోలింగ్ శాతంలో 1.5 శాతం. కాగా, ఈ సారి అత్యధికంగా ఖేడ్బ్రహ్మ నియోజకవర్గంలో 7331 ఓట్లు నోటాకు వచ్చాయి. ఇక డాంటాలో 5213 ఓట్లు, ఛోటా ఉదయ్పూర్లో 5093, దేవ్గధ్బారియాలో 4821, షెహ్రాలో 4708, నైజర్లో 4465, బర్డోలిలో 4211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4022 ఓట్లు నోటా వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm