నవతెలంగాణ - హైదరాబాద్
బుల్లితెర నటి, యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం నెలకొంది. గురువారం విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ విష్ణు భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మై డియర్ లవ్లీ అమ్మా.. ఈ రోజు వరకూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాస వరకూ గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం.. అలాగే బలహీనత కూడా. ఇకపై ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావు. ముఖ్యంగా నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉంటావు. అలా, నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని కన్నీటి పర్యంతమైంది. తన తల్లిని హత్తుకున్న మరో ఫొటోని షేర్ చేస్తూ.. ‘‘ఇకపై నీ ముద్దులను మిస్ అవుతాను అమ్మా’’ అని పేర్కొంది. మరోవైపు విష్ణుకు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర తారలు కామెంట్లు పెడుతున్నారు. విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. ఈటీవీలో ప్రసారమైన ‘పోవే పోరా’తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బుల్లితెర వేదికగా ప్రసారమైన పలు కార్యక్రమాల్లో అలరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2023 12:36PM