నవతెలంగాణ - అమరావతి
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జ్ చింతకాయల విజయ్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలు, లాయర్లతో కలిసి ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్ భార్య వైఎస్ భారతి లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో 'భారతి పే' పేరుతో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఐటీడీపీ ద్వారానే ఈ పోస్ట్ సర్కులేట్ అయిందంటూ... విజయ్ పై ఏపీ సీఐడీ అధికారులు ఐపీసీ సెక్షన్లు 419, 469, 153 ఏ, 505 (2), 102 బీ, రెడ్ విత్ 34, 66 (సీ) తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 2000ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 11:16AM