నవతెలంగాణ-హైదరాబాద్ : యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (126)నాటౌట్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. శుభ్మన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ స్కోర్ నిర్ణిత 20 ఓవర్లకు 234 పరుగులు చేసింది. దీతో న్యూజిలాండ్ కు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాహుల్ త్రిపాఠి (44), హార్దిక్ పాండ్యా (30), సూర్యాకుమార్ (24) పరుగులు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm