Puducherry | DMK MLAs arrived at Puducherry Legislative Assembly Hall wearing school uniforms, in protest against the govt for not providing uniforms, bicycles and laptops to the school students. pic.twitter.com/Gb0ZXlZfuC
— ANI (@ANI) February 3, 2023
నవతెలంగాణ చెన్నై: పుదుచ్చేరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాఠశాల విద్యార్థుల్లా యూనిఫాం ధరించి పుస్తకాల బ్యాగ్తో అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. పాఠశాల విద్యార్థుల పట్ల ప్రభుత్వ పనితీరుపై పుదుచ్చేరిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు పుదుచ్చేరి ప్రభుత్వం యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్టాప్స్ ఇవ్వడం లేదని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై నిరసన తెలిపేందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు యూనిఫాం, ఐడీ కార్డ్స్, బ్యాగులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సైకిల్ తొక్కుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్టాప్స్ ఇవ్వలేదెందుకని.. ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.