నవతెలంగాణ బెంగళూరు: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో సినీనటుడు తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ తీశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు’’ అని ఆయన తెలిపారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm