నవతెలంగాణ - హైదరాబాద్
ఇటీవల సికింద్రాబాద్-విశాఖ నగరాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రైలుపై ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరిగింది. ఇటీవల ప్రారంభోత్సవానికి ముందు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ కోసం విశాఖ చేరుకుంది. అయితే, కంచరాపాలెం వద్ద కొందరు వ్యక్తులు రాళ్లు విసరడంతో రెండు బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఇదే తరుణంలో విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఓ బోగీకి చెందిన ఎమర్జెన్సీ విండో దెబ్బతినడంతో, ఆ విండో మార్చారు. ఆ క్రమంలో వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా రాళ్లు విసిరిన వ్యక్తులను గుర్తించినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:56PM