Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడులలో వికసిస్తున్న బాల సాహిత్యం... | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Nov 14,2022

బడులలో వికసిస్తున్న బాల సాహిత్యం...

             బాలలకు మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను వారసత్వంగా అందించేది బాల సాహిత్యమే. వేల ఏండ్ల కిందటి నుంచే తెలుగు నెలలో మౌఖికం ద్వారా బాల సాహిత్యం విలసిల్లింది. చాలామంది ప్రాచీన, ఆధునిక కవులు తమ బాల్యం నుండే రచనలు ప్రారంభించారు. పసి హృదయాలలో బాల సాహిత్యం ద్వారానే విజ్ఞాన బీజాలు మొలకెత్తుతాయి. భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. తద్వారా అనేక మంది పిల్లలు తమ ఊహాశక్తికి పదును పెడుతూ రచనలు చేయడం జరుగుతుంది. ఇది బాల సాహిత్యంలో విప్లవా త్మకమైన పరిణామం. ఇదో నూతన వరవడిగా భావించవచ్చు.
              నేడు మన బడి పిల్లలు కవులుగా, రచయితలుగా పుస్తకాల రూపంలో అచ్చవుతున్నారు. బాల్యం నుండే బాల బాలికలలో బాల సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించినట్లయితే భవిష్యత్తులో మంచి నడవడిక కలిగిన పౌరులుగా ఎదుగుతా రనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకుగాను పాఠశాలలే బాల సాహిత్యానికి కేంద్ర బిందువులవ్వాలి. బడి అనే గుడిని కేంద్రంగా చేసుకొని బాల సాహిత్యం విస్తృతంగా సజన జరిగి తీరాలి. అందుకుగాను పాఠశాల గ్రంథాలయాలు, బాల సభలు, బాల కవి సమ్మేళనాలు ప్రముఖ పాత్ర వహించాలి. అప్పుడే విద్యార్థుల్లో భాషాభిమానం పెరుగుతుంది. బాల సాహిత్యం రాస్తే ఏమొస్తది? అనే భావన ఇప్పటికీ సమాజంలో, చాలామంది ఉపాధ్యాయులలో నాటుకుని ఉంది. ఇది సరైన భావన కాదు. మంచి సమాజం రాణించాలన్నా, విలువలు గల వ్యక్తులుగా ఎదగాలన్నా బాల సాహిత్యం అందుకు ఎంతగానో దోహద పడుతుంది. బడినే కేంద్రంగా చేసుకొని, ఉపాధ్యాయుల మార్గ దర్శకత్వంలో కృషి జరిగినప్పుడే బాలసాహిత్యం వర్ధిల్లగలదు. అందుచేత పాఠశాలలే వేదికలుగా, పాఠశాల విద్యాకమిటీ, సాహిత్యోపాధ్యాయులు, భాషో పాధ్యాయులు, బాలసాహితీ వేత్తలు ముఖ్య భూమిక పోషించాలి.
బాల సాహిత్యంలో రోజురోజుకు పరిస్థితులు మారుతు న్నాయి. మూస పద్ధతిలో రాజులు, దెయ్యాలు, జంతువుల కథలను చెబితే వినే పరిస్థితుల్లో విద్యార్థులు లేరు. నేటి కొత్త తరం స్మార్ట్‌ తరంగా దూసుకొస్తుంది. వెనుకటి లాగా వెనుకటి కథలు చెబితే ఇప్పటి తరం పిల్లలు వినే స్థాయిలో ఉండరు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్లు, సెల్‌ ఫోన్లు వచ్చినంక ''ఊ...'' కొట్టె కథలకు ప్రాధాన్యత తగ్గింది. పిల్లల ఆలోచన విధానము శరవేగంగా మారుతోంది. మరి ఇలాంటి పరిస్థితులలో బాలసాహిత్యం కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. పిల్లల కోసం పెద్దలు రాసే ఆలోచనా సరళి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల బాలికలలో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో నేటి తరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది. పిల్లల హదయాలను తాకే సాహిత్యాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నేటి బాలసాహీతీ వేత్తలపై ఉందని గ్రహించాలి. పెద్దవాళ్లలో కూడా పిల్లవాడు దాగి ఉంటాడని మనం భావించాలి. గతంలో కంటే ఇప్పుడు విస్తృత స్థాయిలో బాల సాహిత్యం బయటకు వస్తున్న మాట వాస్తవమే. పిల్లల ప్రపంచం చాలా పెద్దది. పిల్లల కోసం బాల సాహిత్యం ఎలా ఉండాలి? అని ఆలోచించాలి. పిల్లల తరగతి, వారి మానసిక, శారీరక పరిస్థితులు, అవగాహన స్థాయిలను పరిగణలోకి తీసుకుని వారికి జ్ఞానాన్ని పెంచే విధంగా రచనలు సాగాలి. పిల్లలు పాఠ్య పుస్తకా లకు పరిమితం కాకూడదు. తెలుగు బాల సాహిత్యంలో చక్రపాణిని ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. అతి తక్కువ ధరతో చిన్న పుస్తకాలను ముద్రించి ఆ రోజుల్లో అమ్మేవాడు. నేటి జనరేషన్‌కు తగ్గ కథలు రాసే రచయితలు తక్కువగా ఉండడం కొంత బాధగానే అనిపిస్తుంది. అవార్డుల కోసమే, పేరు కోసమే రాసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని రాయడం కాకుండా, పెద్దల అభిప్రాయాలను పిల్లల మీద రుద్దుతున్నారనే విమర్శ కూడా లేకపోలేదు. దళితులు, స్త్రీల గురించే ఎక్కువగా రాస్తున్నారని, కనీసం పిల్లల గురించి ఆలోచించడం లేదని చాలా మంది బాధ వ్యక్తం చేస్తున్నారు. విద్య ధనార్జన కోసం, మార్కుల కోసం కాకుండా, విశాల భావన కోసం,బాల సాహిత్య వికాసం కోసం ఉండాలి. సమాజంలో బాల సాహిత్య విలువలు లేకపోవడం వల్లే పిల్లలు సంకుచిత భావాలకు లోనై అసాంఘిక శక్తులుగా మారుతు న్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా స్కూళ్లలో పిల్లలు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. కానీ అదే మన పాఠశాలల్లో అయితే చించుతారని కొన్నిచోట్ల గ్రంథాలయాల్లోని పుస్తకాలు పిల్లలకు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా పిల్లలకు కలగాలి. చివరకు చెడు ఓడిపోతుందని, ధర్మమే గెలుస్తుందన్న భావన రావాలి. ప్రతి పాఠశాలలో డిజిటల్‌ టీవీలు ఉన్నందున యాని మేషన్‌తో కూడిన బాలసాహిత్య ప్రక్రియలను ఆయా చానల్స్‌ ద్వారా పిల్లలకు చూపించగలగాలి. బాల సాహిత్యం వల్ల పిల్లలలో విలువలే కాకుండా, తార్కికశక్తి, ఊహాజనిత శక్తి, శ్రవణ శక్తి,పఠణ నైపుణ్యం కలుగుతాయి. నేటి తరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతలకు బాల సాహిత్యం ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది. ఇదంతా మాతృభాష ద్వారానే సాధ్య మని ప్రముఖ భాషావేత్త ''నోమ్‌ చోమ్‌ స్కీ'' చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.
ఇవ్వాల విద్యార్థులు నేర్చుకునే స్థాయి నుండి రాసే స్థాయికి ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు . అనేక పాఠశాలల నుండి పిల్లలు రాసిన వందల కొద్ది పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి. ఇది గొప్ప పరిణామంగా మనం భావించాలి. దీని వెనక ఎంతో మంది ఉపాధ్యాయుల కృషితో పాటు, బాల సాహితీవేత్తల కృషి దాగి ఉందని చెప్పొచ్చు. బాల సాహిత్య విషయానికి వస్తే దీన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదట మౌఖిక/ రాతపరం గా విభజన ఉన్నప్పటికీ, సాధారణంగా పిల్లల కోసం పెద్దలు రాసేది ఒకటైతే, రెండోది పిల్లలే తమ కోసం తామే రాసుకునేది.
బాలలపరంగా బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇతమిద్దంగా లెక్కించడం కష్టమే. రామా యణం, మహాభారత కాలంలో కూడా బాల సాహిత్య ప్రక్రియలు ఉన్నట్లు మనకు చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తుంది. పంచ తంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షిణ భారతదేశంలోని గోదావరి తీరాన శిష్యులకు బోధించాడని ఉంది. ఆ గోదావరి నది తీరం మన దగ్గరే ఉంది కాబట్టి బాల సాహిత్యం ఇక్కడే మొదటగా పుట్టిందని చెప్పవచ్చు. చరిత్రలో రుద్రమదేవి తన మనుమడైనా ప్రతాపరుద్రునికి బాల సాహిత్యం నేర్పించినందు వల్లనే గొప్ప రాజు అయ్యాడని ఆధారాలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, బాల సాహిత్యాన్ని మొదట స్పృశించింది అమ్మ. తల్లే బాల సాహిత్య తొలి రూపకర్త. ఆమెనే బాల సాహిత్యాన్ని పలకరించింది. లాలి పాటలు, జోల పాటల ద్వారా తొట్టెలలో తమ పిల్లలకు చిలకరించింది. ఆ తర్వాత భాషావేత్తలు అనేక మంది బాల సాహిత్య రంగంలో కర్తలుగా, సేకర్తలుగా పని చేశారు. చందమామ, జాబిల్లి, బాలమిత్ర, బాల భారతం లాంటి పుస్తకాలు బాల సాహిత్యాన్ని పండించాయి. బాల సాహిత్య వికాసం కొరకు విశేషంగా కృషి చేశాయి. ఆకాశ వాణి కూడా ''బాలానందం'' పేరిట బాల సాహిత్యాన్ని పరిచయం చేసింది. అంతే కాకుండా బాలల అకాడమీ కూడా అద్భుతమైన కృషి కొనసాగించింది. అదేవిధంగా చాలా సంస్థలు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, ఉపాధ్యాయ లోకం పిల్లల అభ్యసన అభివృద్ధి కొరకు దోహదపడే బాల సాహిత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక నూతన పాఠ్య
పుస్తకాలలోనూ, హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ బాల సాహిత్యానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ బాల సాహిత్యం అను కున్నంత స్థాయిలో పిల్లలకు చేరువవుతలేదనే విమర్శ కూడా ఉంది. అందుకు పాఠశా లలు, ఉపాధ్యాయులు ఇంకా బాధ్యతగా వ్యవహరిం చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
విద్యార్థులు రాసిన అంశాలను లేదా సేకరిం చిన అంశాలను ప్రదర్శింపజేయాలి. విద్యా ర్థులు రాసిన కథలు, కవితలు, గేయాలు, పద్యాలు, నాటికలు, చిత్రాలు, పుస్తక సమీక్షలు వంటి మొద లగు అంశాలను పత్రికలకు పంపడం గానీ, పుస్తక రూపంలో ముద్రితం చేయడం గానీ జరిగినప్పుడు విద్యార్థులు తమ రచనలను చూసి మురిసి పోతారు. మరింతగా ముందుకు వస్తారు. బాల సాహిత్యం అన్నప్పుడు భాష, భావం పైన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థుల్లో ఊహశక్తిని పెంపొందించాలి. వారికి పూర్తి స్వేచ్ఛ నిచ్చి, అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా విద్యార్థులు రాణిస్తారు.
పాఠశాలలో నిర్వహించే గ్రంథాలయ పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలి. చాలా పాఠశాలల్లో గ్రంథాలయ పుస్తకాలు నిర్వహణ సరిగా లేదనేది యదార్థం. విద్యార్థులకు పుస్తకాలు ఇస్తే చింపుతారునే భయం ఉంది. చాలామంది ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు అంశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. బాల సాహిత్యంతో మాకేమి సంబంధం అన్న భావనలో ఉన్నారు. అయితే ఆసక్తి గల ఉపాధ్యాయులున్న చోట గ్రంథాలయాల నిర్వహణ చక్కగా సాగుతోంది. నెలకొక సారి బాలసభ, బాలకవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించడం ద్వారా విద్యార్థులలో బాల సాహిత్య ప్రక్రియలపై అవగాహన పెరుగుతుంది. పాఠశాల వార్షిక సంచికలలో కూడా బాల సాహిత్య అంశాలను జోడించాలి.
బాల సాహిత్యం పరిఢవిల్లాలంటే సాహిత్యాభి మానులైన ఉపాధ్యాయులుంటే సరిపోదు. దానికి తోడు పాఠశాలలో ఇతర ఉపాధ్యాయుల సహకారం, ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. పాఠశాల గ్రంథాలయం లోని పుస్తకాలు వినియోగించే పద్ధతిలో పాఠశాల ఉండి తీరాలి. కాల నిర్ణయ పట్టికలో లైబ్రరీ పీరియడ్‌ కచ్చితంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు అమలు జరిగే విధంగా చూడాలి. పుస్తకాలచే పిల్లలను ఆస్వాదింప చేయాలి. ఆనందింపచేయాలి. సృజన దిశగా పాఠశాల నేపథ్యంగా కృషి జరగాలి. బాల సాహిత్య వికాసానికి బడులే ముఖ్యమైన తావులుగా మారాలి.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ'
హేతువాద ఉద్యమాద్రి రావిపూడి
ఎర్రజెండా
నేడు 'ఎదురీత' ఆవిష్కరణ
రేపు పెళ్ళిపాటలు పుస్తకావిష్కరణ
కవి జయరాజు, కె శ్రీనివాస్‌లకు మఖ్దూమ్‌ జాతీయపురస్కారం
కె రామచంద్రమూర్తి, కుప్పిలి పద్మలకు అరుణ్‌సాగర్‌ పురస్కారాలు
కొలకలూరి పురస్కారాల గ్రహీతలు
వీరే సఫాయి కార్మికులు
బక్రా
ఎండమావిలో ఈత
నానీలు
'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...

తాజా వార్తలు

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.