Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం

        కథలు, కవితలు రాస్తూ, సాహితీ విమర్శలు చేస్తూ, అనువాదాలు చేస్తూ నిత్యం సాహితీ సృజనలో మునిగి ఉండే గొప్ప మానవతావాది పి. శ్రీనివాస్‌ గౌడ్‌. ఆయనలో ఉద్యమకారుడూ ఉన్నాడు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న వారిలో శ్రీనివాస్‌ గౌడ్‌ ఒకరు. బహుముఖంగా తన ప్రస్తావన కొనసాగిస్తున్న శ్రీనివాస్‌ గౌడ్‌ నుంచి వెలువడిన కవిత్వం ధైర్య వచనం.
2012 నుంచి 2020 వరకు రాసిన కవిత్వాన్ని ధైర్య వచనంలో చూస్తాము. సున్నితమైన భావ వ్యక్తీకరణతోనే పదు నైన భావజాలాన్ని పాఠకులకు చేరవేయడంలో కృతకృత్యుల య్యారని చెప్పవచ్చు. పుస్తకంలో 57 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని వైవిధ్యతను చాటే పుస్తకంగా తప్పక నిలుస్తుంది. ఎక్కడా కఠినమైన పదాలు వాడకుండా, చెప్పాల్సిన అంశం నుంచి పక్కకు తొలగకుండా తన భావాలను వ్యక్తీక రించారు. సాధారణ పాఠకులు సైతం సునాయాసంగా చదువు కుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక పుస్తకంలోని కవితలను పరిశీలిస్తే...
కవి ఎప్పుడూ బడుగూ బలహీన వర్గాల పక్షమే వహిం చినట్లు స్పష్టంగా అర్ధమౌతుంది. అందుకే ఇలా కవిత్వ మయ్యారు. ''పుడకా పుడకా చేర్చి గూడల్లే పులుగల్లే... / మాటా మాటా కూడదీసుకొని/ గుండె శకలాలు ఒక్కొక్కటి చేరదీసుకొని.. / నాలో నేనే అనుకుంటా / నిర్మించూ... నిర్మించని...''
వ్యవస్థలోని లోటుపాట్లపట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి ఆయన. మనిషి మీద సంపూర్ణ నమ్మకం కూడా ఉంది. చాలాసార్లు వ్యవస్థ బలహీనపడి నప్పుడు మనుషులే దయా దీపాలుగా ఉద్భవిస్తారు. వారే దేశానికి ఆశాలతలంటారు కవి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై ప్రజలు పిట్టల్లా రాలుతున్న కాలం అది. పాలకులు చేష్టలుడిగి కలుగుల్లో దాక్కున్న కాలం కూడా అదే. అంతా స్తంభించిపోయింది. ఎటు చూసినా శూన్యం ఆవరించి ఉంది. ఆ సమయంలో ఎటూ దిక్కు తోచని వలస కార్మికులను వేగంగా చేర వేసే రవాణా వ్యవస్థ లేదు. ప్రాణాలు విడిస్తే సొంత గడ్డపైనే విడవాలనే ఒకేఒక ఆశతో వేలాది కిలోమీటర్లను నడుస్తూ సొంతూరి బాటపట్టారు వాళ్ళు. అటువంటి సమయంలో వారికి అండగా నిలబడి చేతనైన సాయం చేసిన నిజమైన మనుషులకోసం అందమైన కవితను సృష్టించారు.
''తలుపులు కిటికీలు హృదయాలు మూసుకొని / నగరాలు రోడ్డు మీదకు వదిలేస్తే.. / రెక్కలు కొట్టుకుంటూ / వలసపాట పాడుకుం టున్న బక్కకూలిపక్షులకు/ దారిచూపే బాట లవుతారు బావుటాలవుతారు'' శ్రామిక మధ్య తరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారి జీవితాల్లోని ఆవేదనను కవితాత్మకం చేస్తారు.
సహజతను ఎక్కడా కోల్పోకుండా అతి జాగ్రత్తగా సామాన్య మైన అక్షరాలలో ఒదిగిపోతారు. అవన్నీ ఉన్నతమైన భావాలను ప్రకటిస్తాయి. మనిషిని అంటుతీగలా అల్లుకొని నిలువెత్తు చెట్టులా నిలబెట్టేది సాహిత్యం మాత్రమేనని నమ్ముతారు శ్రీనివాస్‌గౌడ్‌.
''నమ్మకం సడలిపోయి/ మనిషి పడావు పడి కూలిపోయినప్పుడు/ నెర్రెలిచ్చిన కళ్ళలో/ ఒక ఓదార్పు చినుకు కోసం/ గుండెనంతా ఒక ఎదురుచూపు చేసి/ దారినిండా పరచి అలమ టిస్తున్నప్పుడు/ అప్పుడు../ అప్పుడు../ అదొక రూపం వెతుక్కుంటుంది/ ఒక మనిషి రూపం తొడుక్కుం టుంది'' అంటారు ధైర్యవచనం అనే టైటిల్‌ కవితలో. మనుషుల మధ్య అంతరాలన్నీ ఎక్కడో ఓ చోట అంతమవ్వాలని కోరుకుంటారు.
''పాయలు పాయలుగా చెల్లాచెదురై/ చిందర వందరగా పారుతున్న/ చిరుపాయలన్నీ కలవాలి/ మట్టి చేతుల కలలు గెలవాలంటే / ఎక్కడెక్కడి పాయలన్నీ కలవాల్సిందే..'' అంటూ తనలోని ఐక్యతా రాగాన్ని ప్రకటిస్తారు.
ఇలా మట్టి తత్వాన్ని అలవర్చుకుని, మనిషి తనాన్ని కలగనే ఈ కవి రాసిన ధైర్యవచనం సంపుటికి అంతే మట్టి వాసనను శ్వాసించిన మహాకవి మద్దూరి నగేష్‌ బాబు స్మారక కవితా పురస్కారం 2020 - 2022 కు గాను లభించింది. ఈ నెల 10వ తేదీన విజయవాడలోని ఠాగూర్‌ గ్రంథాలయంలో సాయంత్రం 5గంటలకు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌కు అభినందనలు. అలాగే ఇదే వేదికపై మరో ఐదు స్ఫూర్తి పురస్కార బహుమతులు అందు కోబోతున్న 'నెత్తుటి పాదాలు' - సరికొండ నరసింహరాజు, 'తిప్పుడు పొట్లం' - డా.గూటం స్వామి, 'ధిక్కార ఖడ్గం' -అవనిశ్రీ, 'ఒంటి రొమ్ము తల్లి' - అమూల్య చందు, 'మా నాయిన పాట' - సుంకర గోపాల్‌ కు శుభాకాంక్షలు.
(మహాకవి మద్దూరి నగేష్‌ బాబు స్మారక కవితా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..)

- నస్రీన్‌ ఖాన్‌
  9652432981

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమాజపు డి.ఎన్‌.ఏ. - జన్యులిపి
సాహిత్యపు అస్తిత్వాన్ని చూపే దర్పణమే 'తెలుగు సాహిత్యం-మరో చూపు'
ఎద్దు కాలిగిట్టెల శబ్దం
సంపుడు పందెం...
ఒంటరి బతుకు ..
ఆమె నిశ్శబ్దం
ఆశల పల్లకివై వస్తావని...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.