Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హేతువాద ఉద్యమాద్రి రావిపూడి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

హేతువాద ఉద్యమాద్రి రావిపూడి

              హేతువాద, మానవవాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి మరణం మానవాళికే తీరని లోటు. ఎందుకంటే ''హేతువాదం'' అనే ఒక్క పదంపైన ఆయన రాసినంత విస్తృతంగా, లోతుపాతులతో - వాసిలోనే కాదు, రాశిలోనూ విస్తారంగా రాసిన రచయిత, నిత్య గమనశీల కార్యకర్త వెంకటాద్రి కాకుండా ప్రపంచంలో మరెవ్వరూ లేరు. వారు హేతువాద ఉద్యమానికి మానవవాద మలుపును ఇచ్చిన తాత్వికులు. కేవలం హేతువాదం అంటే నాస్తికత్వం అని, ప్రతి విషయాన్ని నిర్వ్ధందంగా వ్యతిరేకించే వారని, మూఢనమ్మకాల నిర్మూలనకు మాత్రమే పరిమితమైనవారని అప్పటివరకు ఉన్న అపోహను, అపార్థాలను తొలగించడం కోసం వారు పడ్డ ''శ్రమ'' అసామాన్య మైనది. రచయితగా, కార్యకర్తగా, ఉద్యమ సారథిగా, పబ్లిషర్‌గా ఇలా రావిపూడి వెంకటాద్రి అనేక ఇబ్బందులతో అనేకమైన బాధ్యతలు దశాబ్దాలుగా మరణానికి 20 రోజుల ముందు వరకూ నిర్వహిస్తూనే వచ్చారు.
            రావిపూడి వెంకటాద్రి ఫిబ్రవరి 9,1922 జన్మించారు. 1943 ఏప్రిల్‌ 5 న కవిరాజాశ్రమం - నాగండ్లలో స్థాపించి, 1946 నుంచి హేతువాద మానవవాద రచయితగా, ఉపన్యాసకులుగా కొనసాగారు.
1956-96 మధ్య నాగండ్ల గ్రామ సర్పంచ్‌గా గ్రామస్తుల కోరిక మేరకు పని చేశారు.1979 - 1989 మధ్య ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ భారత హేతువాద సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. తానే వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన మాస పత్రిక ''హేతువాది''కి 1982 సెప్టెంబరు నుంచి 2023 జనవరి వరకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. అంత ేకాకుండా హేతువాద మానవవాద ఉద్యమానికి ఒక చిరునామా కోసం 1991లో రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌, ఇంకొల్లులో స్థాపనకు మార్గదర్శిగా నిలిచి ఉద్యమకారులకు ఒక గొడుగుగా మారారు. అమెరికా, యూరప్‌లలో పర్యటించిన అంతర్జాతీయ హేతువాది, రావిపూడి వెంకటాద్రి. 1993లో ''హేమా పబ్లికేషన్స్‌'' స్థాపించిన ఆయన ఇప్పటి వరకు 200 పుస్తకాలు ప్రచురించారు. అందులో వంద పుస్తకాలు తనవి కావడం ఒక విశేషమైతే తోటి ఉద్యమకారులను రచనా వ్యాసంగం వైపు మళ్ళించి వారి రచనలకు అవసరమైన సూచనలు చేసి, స్వయంగా తానే ఫ్రూపులు దిద్ది పుస్తకాలు ప్రచురించడం మరో విశేషం.
పేరు కోసం ప్రాకులాటలు, అవార్డుల కోసం ఆరాటం ఎంతమాత్రం లేని వెంకటాద్రికి 1996లో కవిరాజు త్రిపురనేని ట్రస్టు నుంచి కవిరాజు త్రిపురనేని రామ స్వామి స్మారక జీవిత సాఫల్య అవార్డుతో మరెన్నో అవార్డులు వరించాయి. 1999లో ముంబాయిలో జరిగిన అంతర్జాతీయ మాన వవాద నైతిక సంఘ అంతర్జాతీయ సదస్సులో ''బుద్ధుడు- హ్యూమనిస్ట్‌ దృక్పథం'' అంశం మీద ఉపన్యాసం చేసి అంతర్జాతీయ వేదికలపై ఎందరినో ఆలోచింపజేశారు.
వందలాది అధ్యయన తరగతుల్లో ఉపన్యాసకు లుగా, పర్యవేక్షకులుగా శిక్షణ ఇచ్చిన ఉద్యమ మార్గదర్శి రావిపూడి. హేతువాద, మానవవాద సాహిత్యం పరిచయ మయ్యాక, యం.యన్‌.రారు భావాల ప్రభావంతో వచన రచనకు ఉపక్రమించాడు.
''అనంత విశ్వం'' పేరుతో ఐదు భాగాల పుస్తక రచ నను ఆరంభించి ''విశ్వాన్వేషణ'' ''విశ్వతత్వం'' గ్రంథాలు పూర్తి చేశారు. విశ్వాన్వేషణ గ్రంథ రచనతో ఆరంభించి ''పురాణం - ధృవుడు'', ''జీవమంటే ఏమిటి?'', ''మార్క్సిస్టు భౌతిక వాదం'', ''మానవుడు- సమాజం- ప్రకృతి'' తదితర హేతువాద మానవవాద గ్రంథ రచనలను యుక్త వయసులోనే పూర్తి చేసి ప్రచురించాడు. ఎం.ఎన్‌.రారు - భారత కమ్యునిజం, శాస్త్రం - అశాస్త్రం, ఆది శంకరా చార్య వ్యక్తిత్వం - తత్వం, మార్క్సిజం, హ్యూమనిజం, నాస్తికత్వం, ఔనా! వేదాల్లో అన్నీ ఉన్నాయా?, మత జాఢ్యాల మచ్చు తునకలు, మనుస్మృతి మైనస్‌ అశుద్ధం, హ్యూమనిస్ట్‌ సమీక్షలు, వాస్తువు శాస్త్రమా?, అడుగు జాడలు, మనం ఏమి చేయాలి?, స్వామినేని - త్రిపురనేని, హేతువాదం - నైతిక విప్లవం, నేను నా రచన వ్యాసంగం... ఇలా వారి రచన వ్యాసంగం కొనసాగింది. తన చాలా పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువాదం కూడా చేసుకున్నారు.
నిజానికి వెంకటాద్రి గొప్పతనం ఏమిటంటే వారు నిరంతరం తనకు ఉన్న జ్ఞానస్థాయిని అప్డేట్‌ చేసుకుంటూ జీవితాంతం హేతువాద, మానవవాద ఉద్యమానికి లైట్‌ హౌస్‌ గా వేలాది మందికి స్ఫూర్తిని కలిగించారు, ప్రేరణ రగిలించారు. ఆయన కలం తాకని అభ్యుదయ అంశం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్రాసిన రచనలు దాదాపు 7000 పేజీల ప్రింట్‌ రూపంలోని సాహిత్యం రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌ - ఇంకొల్లు ప్రాంగణంలో ఉంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ''ప్రపంచ భావగమన చరిత్ర''లో ఆయన మస్తిష్కం వెలువరించిన భావాలు చిరంతరంగా నిలిచే ఉంటాయి.

- కె శ్రీనివాసాచారి, 7780664115
ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర హేతువాద సంఘం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమాజపు డి.ఎన్‌.ఏ. - జన్యులిపి
సాహిత్యపు అస్తిత్వాన్ని చూపే దర్పణమే 'తెలుగు సాహిత్యం-మరో చూపు'
ఎద్దు కాలిగిట్టెల శబ్దం
సంపుడు పందెం...
ఒంటరి బతుకు ..
ఆమె నిశ్శబ్దం
ఆశల పల్లకివై వస్తావని...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలంగాణ సాహితి ఉమెన్‌ ఫెస్ట్‌లో ఉద్వేగపూరిత 'అంతరంగ ఆవిష్కరణ'
21న ఉగాది కవి సమ్మేళనం
డా|| ఎన్‌. గోపికి భారతీయ భాషా పరిషద్‌ పురస్కారం
'కలుంకూరిగుట్ట'కు రజనీశ్రీ పురస్కారం
వచన కవితలకు ఆహ్వానం
'దేశభక్తి'పై కథల పోటీ
జరగబోయేది
నియంత
నిర్నిద్ర
నిషిద్ధ వస్తువుపై నిర్భయ ప్రకటన 1818
సర్వ సమతా సత్యవాదం - బాపురెడ్డి కవితానాదం
మన కాలం గొప్ప పాత్రికేయ విమర్శక నవలాకారిణి కె.రామలక్ష్మి
కావ్యాలంకారం
పొయ్యిమీదనే ఆకలి కాలిపోతున్నది
16న 'అనార్కలి' ఆవిష్కరణ
17న 'మూడు గుడిసెల పల్లె' ఆవిష్కరణ
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ - పాలపిట్ట
జీవితం వయా కవిత్వం
పదాలకు పూల పరిమళాలద్దిన కవిత్వం - చిగురించిన చెట్టు
'గ్రంథాలయం' కవితలకు ఆహ్వానం
12న స్ఫూర్తి పురస్కారాలు
11న ''శ్యామ'' ఆవిష్కరణ

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.