Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక హిందీస్థాన్‌..! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 03,2022

ఇక హిందీస్థాన్‌..!

పాలన తామనుకున్నట్టుగా సాగాలంటే ఏలినవారు ఎప్పుడూ ప్రజల్లో ఏదో ఒక అంశాంతిని రగిలించాలన్న ''సూత్రం'' బీజేపీకి బాగా వంటబట్టినట్టున్నది. ''మందిరాలు - మసీదులు'' మొదలు ''హిజాబ్‌ - హలాల్‌'' వరకూ అవి సృష్టించిన మంటలు చల్లారనే లేదు, ఇప్పుడు సరికొత్తగా భాషా విద్వేషాలను రెచ్చగొడతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి సంజరు నిషాన్‌ ఏకంగా ''హిందీ మాట్లాడనివారు ఈ దేశం విడిచి వెళ్లిపోవాల''ని హెచ్చరిస్తున్నారు. గత కొంత కాలంగా సాగుతున్న ఈ భాషా వివాదాలకు ఇదొక పరాకాష్ట.
మొన్న అమిత్‌షా ''హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల ప్రజలందరికీ కమ్యూనికేషన్‌ భాషగా హిందీ తప్పనిసరి'' అని హుకూం జారీ చేసినంత పని చేశారు. నిరసనలు వెల్లువెత్తడంతో నాలిక కరుచుకున్నారు. ఇప్పుడీ సంజరు నిషానేమో మరో అడుగు ముందుకేసి ''హిందీ రానివారు అసలు భారతీయులే కాదు'' అంటున్నారు. వీరిద్దరికీ మధ్యలో ''హిందీని నిరాకరించడమంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే''నని ప్రవచించారు పద్మశ్రీ కంగనా రనౌత్‌. దీనికి ముందు బాలీవుడ్‌ నటుడు అజరుదేవగణ్‌ ప్రేలాపనలు ఉండనే ఉన్నాయి. ''పదవీ వ్యామోహాలు - కులమత భేదాలు, భాషా ద్వేషాలు - చెలరేగే నేడు'' అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు గానీ, ఇప్పటికీ అవి చల్లారకపోగా మరింతగా చెలరేగడం ఆందోళనకరం.
అనేకానేక భాషలు ఉనికిలో ఉన్న ఈ దేశంలో, రాజ్యాంగమే గుర్తించిన ఇరవైరెండు జాతీయ భాషలుండగా... హిందీ మాత్రమే దేశ భాష అంటే ఎలా చెల్లుతుందీ..?! ప్రజలు తమ భావ వ్యక్తీకరణకు ఏ భాష సౌకర్యంగా ఉంటే ఆ భాష వాడతారు. అది వారి ప్రాథమిక హక్కు. కాదనే హక్కు ఎవరికుంది? కాదంటే అది ఈ దేశ మౌలిక స్వభావానికే విరుద్ధం కదా! భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత. అందుకే ''సుసంపన్నమైన - బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం'' అంటూ పాఠశాల నుండే ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. ఇందుకు భిన్నంగా, దేశంలో కేవలం 20శాతం ప్రజలకు మాతృభాషగా ఉన్న హిందీని మిగిలిన 80శాతం ప్రజల మీద బలవంతంగా రుద్దాలనుకోవడం ఎలా సమంజసం?! ఇది భిన్న జాతులు, భిన్న భాషలు, విభిన్న సంస్కృతులతో వైవిధ్య భరితంగా విరాజిల్లుతున్న భారతీయతపై దాడిచేయడమే. దేశంలోని ఆయా జాతుల, భాషల ఉనికినీ, స్వయం ప్రతిపత్తినీ ధ్వంసం చేయడమే. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే. ఇదంతా ఏలినవారికి తెలియని సంగతి అనుకుంటే పొరపాటు. మరి తెలిసే చేస్తున్న ఈ కుతంత్రాలు ఏ ప్రయోజనాల కోసం?
దేశంలోని బహుళత్వాన్ని నిర్మూలించి ఏకీకృతం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో భాగమే ఇదంతా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ''హిందూ - హిందీ - హిందుస్తాన్‌'' అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ మిషన్‌ను వేగంగా అమలు చేసే ప్రయత్నంలో మరో అడుగే ఈ హిందీ రగడ. నిజానికి దేశంలో జాతీయ భాషలుగా ప్రకటించిన అన్ని భాషలకన్నా ఆలస్యంగా ఆవిర్భవించిన భాష హిందీ. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నది. అయితే, హిందీ కూడా అందమైన భాషేననడంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు. హిందీని గౌరవించాలనడంలోనూ ఏ అభ్యంతరమూ లేదు. అభ్యంతరమల్లా భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన ఇరవైరెండు భాషలూ జాతీయ భాషలేనన్న నిజాన్ని వీరు గుర్తించకపోవడమే. సాంస్కృతిక ఆధిపత్యం కోసం హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతిపాదిస్తుండగా, దాని అమలుకు అధికార బీజేపీ ప్రయత్నాల్లో భాగమే ఈ హిందీ మంత్రం. వీరి నూతన విద్యా విధానంలోనూ ఇదే సూత్రం. అంతిమంగా ప్రాంతీయ భాషలన్నిటిపై హిందీకి ఆధిపత్యాన్ని కట్టబెట్టడం, తద్వారా దేశమంతటిపై ఉత్తరాది పెత్తనానికి పాదులు వేయడమే వీరి లక్ష్యం.
అమిత్‌షా నుంచి సంజరు నిషాన్‌ వరకూ అందరి వాఖ్యలూ జాగ్రత్తగా వరుస క్రమంలో పరిశీలిస్తే ఇది మరింత స్పష్టమవుతుంది. అమిత్‌షా ''హిందీ భారతీయ ఆత్మ'' అంటే, సంజరు నిషాన్‌ ''హిందూస్తాన్‌'' అంటే ''హిందీ ప్రదేశము'' అని సరికొత్త నిర్వచనం చెపుతున్నారు. దీని అర్థమేమిటి? ఈ దేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, బెంగాలీ, మరాఠీ, ఒరియా వంటి అనేక భాషలు మాట్లాడే ప్రజలెవరూ భారతీయులు కాదన్నమాట! ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడిదాకా వచ్చిందో చూడండి...! ముందు హిందువులు కానివారెవ్వరూ భారతీయులు కాదన్నారు. ఇప్పుడేమో హిందీ మాట్లాడనివారెవరూ భారతీయులుకాదంటున్నారు. ఉప రాష్ట్రపతిగారేమో మాతృభాషలో విద్యాబోధనంటారు. ఈ సంజయుడేమో హిందీలో మాట్లాడనివాడు దేశం వదలిపోమ్మంటాడు. బహుళనాలుకలున్న విషనాగులతో పారాహుషార్‌!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.