Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓడించింది కమ్యూనిస్టులే... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 08,2022

ఓడించింది కమ్యూనిస్టులే...

ఆదివారం మునుగోడు ఫలితం వెలువడగానే సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అయిన అంశం... 'ఉప ఎన్నికలో గెలిచింది టీఆర్‌ఎస్‌.. ఓడింది బీజేపీ.. కానీ ఆ పార్టీని ఓడించింది మాత్రం ముమ్మాటికి కమ్యూనిస్టులే...' ఇది నూటికి నూరు పాళ్లు పచ్చి నిజం. ఇక చిన్న పేపర్ల నుంచి ప్రధాన పత్రికల వరకూ తమ తమ పతాక శీర్షికల్లో... 'కారుకు కమ్యూనిస్టుల ఇంధనం.. కారును గట్టెక్కించిన కమ్యూనిస్టులు.. ఎర్ర గులాబీ.. కారు గెలుపులో కామ్రేడ్ల కీలక పాత్ర...' అనే వార్తలను పరి చేశాయి. ఈ క్రమంలో మును గోడులో గెలవటం ద్వారా తెలంగాణలో, అందునా దక్షిణ తెలంగాణలో, అందునా వామపక్షాల కంచుకోటలైన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాలుపెట్టేందుకు ఆశపడి, అర్రులుచాచిన 'కమలాన్ని...' ప్రజలు అడ్డుకున్నారు. తద్వారా 'నిలిచి ఉన్న నీటిలో కమలాలే కాదు.. క్రిములూ ఉంటాయి...' అంటూ పెద్దలు చెప్పిన హితోక్తిని తీవ్ర హెచ్చరికలాగా భావించి కమలంతోపాటు మతోన్మాద, మనువాద క్రిములనూ శుభ్రంగా తుడిచి పారేశారు.. ఇందులో కామ్రేడ్‌ల పాత్ర సుస్పష్టం.
మొత్తం ఉప ఎన్నిక ప్రహసనాన్ని, ఫలితాన్నీ, ఓట్లతో కూడిన గణాంకాలను పరిశీలిస్తే... మొదటి నుంచి బీజేపీపై ఎదురుదాడి చేయటంలోనూ, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారంటూ చెప్పటంలోనూ, ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని తనకనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్‌ వ్యూహం పక్కాగా ఫలించింది. ఆ ఫలితమే ఉప ఎన్నికలో ప్రతిఫలించిందని చెప్పక తప్పదు. కాకపోతే 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం, ఎనిమిదేండ్ల అద్భుత పాలన, మునుగోడు నియోజకవర్గంలో సైతం 99 శాతం మందికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందా యని ప్రభుత్వాధినేతలు చెప్పు కుంటున్న క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థి కేవలం 42.3 శాతం ఓట్లనే సాధించటం గమనార్హం. మరోవైపు ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా మొత్తం మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ప్రచారం చేసిన పరిస్థితి. ఆ మాటకొస్తే అమిషా సహా బీజేపీ కేంద్ర నాయకత్వమంతా ఈ ఎన్నికపైనే కేంద్రీకరించిదను కోండి. అయినప్పటికీ మునుగోడు అనుభవం నుంచి గులాబీ పార్టీ కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సంక్షేమ, కార్యక్రమాలే గట్టెక్కించలేవన్న వాస్తవాన్ని మనం ఇక్కడ గుర్తెరగాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కిందిస్థాయి ఎమ్మెల్యేల వరకూ నిత్యం ప్రజలతో సంబంధాలు నెరపటం, వారి సమస్యలను ఓపిగ్గా వినటం, వాటి పరిష్కారం కోసం కృషి చేయటమనేది నిత్యకృత్యం కావాలి. దీంతోపాటు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పథకాలతోపాటు వ్యవస్థీకృతంగా ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి, రవాణా మౌలిక వసతుల కల్పన తదితరాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోడు భూములు, నిర్వాసితులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రైతాంగం, ఆర్టీసీ, వీఆర్‌ఏలు, కనీస వేతనాల జీవో తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలి.
ఇక ఈ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కమలనాథులకు ఒక విషయం మాత్రం సుస్పష్టంగా అర్థమై ఉంటుంది. అదేంటంటే... సాయుధ పోరాట గడ్డ మీద తమ పప్పులుడకబోవని. కమ్యూనిస్టు పార్టీల నుంచి మహామహులు ప్రాతినిధ్యం వహించిన నేల మీద తమ పాచికలు పారబోవని. అందుకే బీజేపీ సీనియర్‌ లీడర్‌ ఈటల రాజేందర్‌ లాంటి వారు సైతం... 'మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయమనేది కమ్యూనిస్టులు పెట్టిన భిక్ష...' అని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఢిల్లీ పెద్దల ప్రోద్బలంతో ఏరికోరి తెచ్చుకున్న ఉప ఎన్నికలో జనం ఇచ్చిన తీర్పుకు బీజేపీ బొక్కా బోర్లా పడింది. ఇదే సమయంలో దేశాన్ని ఏకం చేయడానికంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ... భారత్‌ జోడో యాత్ర చేపడితే, మునుగోడులో మాత్రం ఆ పార్టీ నేతలు ఏకం కాలేక, ఐక్యంగా పోరాడలేక చేతులెత్తేశారు. దీంతో అక్కడి అభ్యర్థి బోరుబోరున విలపిస్తూ కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి నిష్క్రమించిన దుస్థితి. దీంతో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న పార్టీకే మేం మద్దతిస్తామంటూ కమ్యూనిస్టు పార్టీలు చెప్పిన మాటకి కాంగ్రెస్‌ దీనాతిదీన స్థితి మరింత బలాన్ని చేకూర్చింది. చివరికి 'తోక పార్టీలు, సూదులు, దబ్బణాలు...' అంటూ ఒకప్పుడు ఎర్రజెండాలను ఎగతాళి చేసిన వారికి సైతం ఈ ఫలితం కనువిప్పు కలిగించింది. అందువల్ల 'తోకలే మునుగోడులో గులాబీ పతంగిని ఎగరేశాయి. అవే లేకపోతే ఆ పతంగే ఎగిరేది కాదు...' అంటూ రాజకీయ విశ్లేషకులు ముక్తాయింపునివ్వటం ఇక్కడ గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.