Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పునర్‌ 'అంకితం' | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 15,2022

పునర్‌ 'అంకితం'

''వారిజాక్ష్షులందు, వైవాహికములందు, ప్రాణ, విత్త, మాన భంగమందు బొంకవచ్చ''ని శుక్రనీతి పర్మిషన్‌ ఇచ్చింది. మొదటి రెండు అవకాశాలు, అవసరాలు లేని పెద్దమనిషికి మిగతా మూడింటిలో ఏదో ఒకటి ఉండి ఉండవచ్చు. ఎంత అవసరం లేకపోతే ఇరవయి నెలలుగా ఉత్పత్తి నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మొన్నటికి మొన్న భారత ప్రధాని జాతికి 'అంకితం' చేస్తారు?! 'జాతికి అంకితం' అనేమాట ఒక్కదెబ్బకి నిఘంటువుల్లో అర్థాలు తిరగరాసుకోవాల్సిన స్థితి తెచ్చారు కదా!?
భారత ప్రధానికి ఆయనమీద ఆయనకి గట్టి నమ్మకం ఉండి ఉండవచ్చు. కానీ ప్రజల్ని శుద్ధ దద్దమ్మలుగా లెక్కిస్తేనే ప్రమాదం. ఆ ఫ్యాక్టరీలో దాదాపు రెండేండ్లుగా ఉత్పత్తి నడుస్తోంది. పాత టౌన్‌షిప్‌ను రిపేర్లు చేసి ఆరువందల మంది ఎగ్జిక్యూటీవ్‌లు, నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌లకు ఇచ్చారు. మరో ఏడువందల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరందరి చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థవుంది రామగుండంలో. అంతేనా? ఈ ఎరువుల కర్మాగారం వల్ల ప్రభావితమైన ఐదారు గ్రామాల ప్రజలున్నారు. దీని వాయు కాలుష్యంతో ఇబ్బంది పడే వందలాది మంది జనం ఉన్నారు. 'డిపెండెట్స్‌' ఉద్యోగాల సమస్య ఉంది. ఇన్ని ఏనుగుల్ని తివాసి కిందికి నెట్టేసి మీరు 'గజం మిథ్య! పలాయనం మిథ్య!' అంటే కుదరదు మోడీ సాబ్‌! కబేళాలో మేకలు, గొర్రెలు, పశువుల్ని తెగనరికిన చేతులు హఠాత్తుగా కొన్ని మేకలకి గడ్డిపరకలేస్తూంటే దేశ ప్రజలు వాటిమీద ప్రేమను కోవట్లేదు! ఇప్పుడు మేపేది అప్పుడు కోతకేననేది జనవాక్యం!
సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యాన 1995 తర్వాత ఏ ఎరువుల కంపెనీలో అదనంగా పెట్టుబడులు పెట్టలేదు ప్రభుత్వాలు. పైగా 2002లో సింద్రి, బరౌనీ, గోరఖ్‌పూర్‌, రామగుండం మూసేసింది నాటి వాజ్‌పారు సర్కార్‌. దీంతో దిగుమతులు విపరీతంగా పెరిగాయి. ప్రయివేటు కర్మాగారాలు మీద ఆధారపడటం పెరిగింది. వాటికి చెల్లించే సబ్సిడీల బిల్లు పెరిగింది. ఇది 2019-20లో రూ.83వేలు కోట్ల నుండి 2022-23 అంతానికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రభుత్వాల బడ్జెట్‌ అంచనాలే తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఈ దశలో పీపుల్స్‌ కమిషన్‌ ఆన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ Ê పబ్లిక్‌ సర్వీసెస్‌ (పిసిపిఎస్‌పిఎస్‌) తరఫున థామస్‌ ఐజక్‌, ఇ.ఎ.ఎస్‌. శర్మ, ఎస్‌.పి. శుక్లా, సి.పి. చంద్రశేఖర్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, దినేష్‌ అబ్రాల్‌ వంటి మేధావులు 1978 తర్వాత అమల్లో ఉన్న ప్రభుత్వ ధరల నిర్ణయ విధానమే (అడ్మినిష్టర్డ్‌ ప్రైసింగ్‌) మన రైతాంగాన్ని కాపాడిందని, ప్రభుత్వరంగంలో ఎరువుల కంపెనీలను పునరుద్ధరిం చాలని, ఎరువుల ఉత్పత్తికోసం సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో అందించాలని వంటి సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రారంభిస్తున్నారా? బాగా మేపి అస్మదీయులకు కట్టబెట్టేందుకా? మనం వెండితెరపై చూడాల్సిన చిత్రమే.
నేడు కనీస మద్దతు ధరల కోసం రైతాంగ ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. మద్దతు ధర నిర్ణయించడంలో ఎరువుల ధర కీలకం. 1969లో నాటి గృహమంత్రి వై.బి. చవాన్‌ ''హరిత విప్లవం ఎర్ర విప్లవం''గా మారుతుందేమోనన్న మాటలు మోడీకి గుర్తొచ్చాయో, నాటి గృహ మంత్రిత్వశాఖ తయారుచేసిన నోట్‌లో రాసిన ''ఒక సంక్లిష్ట కేంద్రకం (కాంప్లెక్స్‌ న్యూక్లియస్‌) పెద్ద విస్ఫోటనమవుతుందేమో'' నన్న విషయం చదివారో ఏమో ఎరువుల కంపెనీలకు పచ్చజెండా ఊపారు.
గతవారం నుండి తెలంగాణలో జరుగుతున్న ప్రచారాన్ని కౌంటర్‌ చేసే ప్రయత్నంలో రామగుండం సభలో ప్రధాని తప్పుల్లో కాళ్ళేస్తూ పోయారు. సింగరేణిని 49శాతం వాటావున్న మేము ఎట్టా ప్రయివేటీకరిస్తామని ఒక చొప్పదంటు ప్రశ్న సంధించారు. తాజాగా 141 బ్లాకులను కేంద్రం వేలానికి పెట్టింది. దానిలో మన సింగరేణివి నాలుగున్నాయన్న సత్యానికి ముసుగేసే ప్రయత్నం చేస్తున్నారు. ''అసలు నేను లెక్కేపెట్టుకోనని నీ యెదవాలోచన'' అనే ముత్యాల ముగ్గులో రావుగోపాల్రావు డైలాగ్‌ గుర్తుచేసుకుందాం. మన తెలంగాణ జనం ఏ వివరాలు చూసుకోరు, తెలుసుకోరనేది బీజేపీ నేతల నమ్మకంలా ఉంది. మనకి ఈ లెక్కలే కాదు, ఇటీవల కోలిండియాలో ఒకే ఒక్కశాతం వాటా కొన్న కెనడాకి చెందిన ఎంఎన్‌సి ఎన్‌టిపిసి అమ్మే విద్యుత్‌ ధర వల్ల తమకొచ్చే లాభం తగ్గుతుందని మోకాలొడ్డిన విషయం కూడా తెలుసు. అంతేకాదు, నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేర లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్ని మీరు బలితీసుకుంటున్నారని కూడా తెలుసు తెలంగాణ సమాజానికి. మీ మూతికి రక్తపు మరకలు అలానే ఉన్నాయి మోడీ సాబ్‌! మీకు కోరల్లేవని, చారల్లేవని పైన కప్పుకున్న ఆవుచర్మాన్ని సరిచేసుకుంటూ, గడ్డి పరకలే గతుకుతామని చెప్తే నమ్మేవాళ్ళెవరూ లేరు తెలంగాణలో!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.