Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంబేద్కర్‌ ఆశయాలను సాధిద్దాం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

అంబేద్కర్‌ ఆశయాలను సాధిద్దాం

- ప్రొఫెసర్‌ హరగోపాల్‌
- 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
ఆధునిక భారతదేశానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తండ్రి వంటి వారు అని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. మంగళవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ భవన్‌లో డాక్టర్‌ అంబేద్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగానికి సవాళ్లు' అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆధునిక భారతదేశానికి తండ్రి వంటి వారిని, ఆయన ఆశయ సాధన కోసం కృషిచేసినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని కొనియాడారు. మత ఛాందసవాదం ముఖ్యంగా హిందూ ఫండమెంటలిజం రాజ్యాంగానికి పెనుముప్పు అని అన్నారు. దేశంలో సామ్రాజ్యవాద ఆర్థికాభివృద్ధి నమూనా అనుసరిస్తున్న నాటి నుంచి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఎక్కువైందని అన్నారు. రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతోందని, ఫాసిజానికి చేరవ అవుతున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం మరింత పెరిగిందన్నారు. ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఒకవైపు మతోన్మాదులు, సంపదను మరింతగా పెంచుకోవడానికి కార్పొరేట్లు రాజ్యాంగ సూత్రాలను మార్చాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీంతో ఒకప్పుడు రాజ్యాంగంలో ఉన్న లోపాలను సవరించాలని కోరే స్థాయి నుంచి ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికీ, ఇప్పటికీ వ్యవస్థలో ఆర్థికంగా అనేక మార్పులు వచ్చాయన్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తి కోల్పోతోందని తెలిపారు. రాజ్యాంగాన్ని నిరాకరించిన వారే నేడు పాలకులుగా ఉండి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్య, అభ్యుదయ శక్తులు ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ గోపాల్‌ రావు, ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు రత్నం, ప్రధాన కార్యదర్శి బాబురావు, పీతల అంబేద్కర్‌, రాజా, డాక్టర్‌ సుందర్‌ కుమార్‌ దాస్‌, డాక్టర్‌ సిద్దోజీ రావు, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ ప్రవీణ పాల్గొన్నారు.
రాజ్యాంగం లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది: ప్రొఫెసర్‌ కంచె.ఐలయ్య
ఓయూ: బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే...మనమంతా నియంతృత్వ పాలన అనుభవించేవారమని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడిందంటే అందుకు కారణం అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమేనని స్పష్టం చేశారు. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా ఓయూలో 'అంబేద్కర్‌ నాడు-నేడు' అంశంపై అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, యూజీసీ డీన్‌ కార్యాలయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రపంచంలోని మెజార్టీ దేశాలు మతపరమైన, వామపక్ష, ఫాసిజం వంటి మూడు రూపాల్లోని నియంతృత్వ పాలనలో ఉండేవని వివరించారు. అంబేద్కర్‌ లేకపోతే నాలుగోతరహా నియంతృత్వంలోకి భారత్‌ వెళ్లేదని అన్నారు. అంబేద్కర్‌ వల్లే నేడు ఓయూలో పెద్దఎత్తున ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా పగ్గాలు దక్కాయని అన్నారు. అంబేద్కర్‌, ఫూలే, పెరియార్‌ల రచనలను ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, ముసలయ్య తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ కొండ.నాగేశ్వరరావు, బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చలమల్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మంగు, మైనారిటీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సయ్యెదా అజీమ్‌ ఉన్నీసా, సహా ఆయా విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా సీక సాయికుమార్‌గౌడ్‌ జన్మదిన వేడుకలు
గగన సేవలు ఇక హైదరాబాద్‌ నుంచి..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం విడ్డూరం
పెండింగ్‌ అభివృద్ధి పనులను మొదలు పెడతాం
నేటి బాలికలే రేపటి మహిళలు
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి :చైర్మన్‌ అబ్దుల్లా సాది
సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా ప్రవీణ్‌
కుత్బుల్లాపూర్‌లో ఉచిత పశు వైద్య శిబిరం
రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
సైదాబాద్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు: సర్పంచ్‌ మల్లేష్‌
తెలంగాణ వెల్నెస్‌ సెంటర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్సోర్సింగ్‌..
క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించిన శ్రీనివాస గుప్తా
కంటి వెలుగుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుదాం
అర్హులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
జై గణేశా భక్తి సమితిని క్యాలెండర్‌ ఆవిష్కరణ
ప్రజలకు సేవ చేయడం అభినందనీయం
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అద్భుత విజయాలు
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి
వైశ్యులు, బ్రాహ్మణులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రకృతిని కాపాడుకోవడానికి మిగిలింది ఆరేండ్లే
ట్రీ-కటింగ్‌ పేరుతో భారీ కొమ్మలు నిరికివేత
చదువుతో కూడిన ఆరోగ్య సేవలు అవసరం
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
పార్కుల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కాలేరు
విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు

తాజా వార్తలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.