Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళిత బంధు స్కీములలో ఎమ్మెల్యేలకి అధికారాలు సరికాదు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

దళిత బంధు స్కీములలో ఎమ్మెల్యేలకి అధికారాలు సరికాదు

- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం, నియోజకవర్గ కనీనర్‌ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
             ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డబల్‌ బెడ్‌ రూమ్‌, దళిత బంధు స్కీంలో ఎమ్మెల్యేలకే సర్వాధికారం అనే నిర్ణయాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్‌ మీడియం బాబూరావు, నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వాలు పెట్టే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా ఉండాలని కోరారు. శుక్రవారం వారు సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వరకే పరిమితం చేస్తే అదొక రాజకీయ పార్టీకే పరిమితం చేసినట్టుగా అవుతుందని వారన్నారు. ఈ స్కీంలలో రాజకీయ జోక్యం పెరుగుతుందని తద్వారా అర్హత కలిగిన పేదలకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు అధికంగా ఉన్నారని, అర్హత కలిగినటువంటి పేదలు వేలల్లో ఉన్నారని అటువంటి వారికి ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణం వ్యయం రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించడం వలన స్థలం లేని పేదల పరిస్థితి ఏమిటనే ఆందోళన పేదలలో కలుగుతుందని వారన్నారు. స్థలం ఉన్నవారికి కూడా నిర్మాణ వ్యయం అయిదు లక్షలు ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలము కేటాయించి నిర్మాణ వ్యయం రూ.5 లక్షల మంజూరు చేయాలని వారు కోరారు.
పోడు భూముల విషయంలో గ్రామసభలలో ప్రభుత్వ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తాతల కాలం నుండి సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతర పేదలకు అర్హత కలిగిన వాళ్లకు అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే దిశగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయాలని అన్నారు. పోడు భూముల సమస్యలను సరైన పద్ధతిలో ప్రభుత్వం పరిష్కారం చేయని కారణంగానే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వారన్నారు. ఇటీవల జరిగిన ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాసరావు ఘటన బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల సమస్యను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న పోడు భూముల సమస్యల విషయంలో ప్రభుత్వ అధికారులు కొంత వివక్షను కొనసాగిస్తున్నారని అన్నారు.
గ్రామ సభ తీర్మానం సుదీర్ఘకాలం నుండి వ్యవసాయం చేస్తున్న భూములు, వాటి యోగ్యతని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలా కాకుండా గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా, సాటిలైట్స్‌ ద్వారా నిర్ణయాలు చేస్తాము అంటే అసంతృప్తితో ఉన్న గిరిజనులు ఎదురు తిరుగుతారని, అప్పుడు శాంతి భద్రతలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సర్వేలు, గ్రామసభలు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారందరికీ పట్టాలు ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. పోడు భూములను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అవసరమైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులను కూడా పోడు భూముల అభివృద్ధి కోసం ఖర్చు చేయడం ద్వారా పేద గిరిజనులకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని వారు కోరారు. కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సమావేశంలో పై నాయకులతోపాటు ఎం.బి.నర్సారెడ్డి, సరియం కోటేశ్వరావు, సున్నం గంగ, మరం చంద్రయ్య, కొర్శ చిలకమ్మా, సరీయం రాజమ్మ, కారం నరేష్‌, నకిరేకంటి నాగరాజు, మచ్చ రామారావు, బందెల చంటి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.