Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

పోడు పట్టాల పంపిణీకి సిద్ధం

- మంత్రులు, రాష్ట్ర అధికారులతో వీసీలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫిబ్రవరిలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, పామ్‌ ఆయిల్‌ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, జి.ఓ. 58, 59, ఐడిఒసిలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కలెక్టర్‌ లు ముందస్తుగా ఎస్‌.డి.ఎల్‌.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్‌ పూర్తి చేసి ముఖ్యమంత్రి నిర్ణయించే తేది నుండి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని సీఎస్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ మాట్లాడుతూ.. పోడు భూముల పట్టాల పంపిణీకి సూచనల ప్రకారం సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడి కింద పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన మోడల్‌ పాఠశాలలను పండుగ వాతావరణం లో పునఃప్రారంభం చేస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జీవో 58 కింద 3198, జీవో 59 కింద 1,617 దరఖాస్తులు అమోదించినట్లు తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల సీనియార్టీ జాబితా, ఖాళీల జాబితా ఆన్‌ లైన్‌ లో నమోదు చేశామని, మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి పరిశీలించామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, డిఇఓ సోమశేఖరశర్మ, డిఎంఅండ్‌హెచ్‌ఓ డా. బి. మాలతి, డిటిడబ్ల్యూఓ కృష్ణ నాయక్‌, హార్టికల్చర్‌ ఏడీ కె. అనిత, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌
జిల్లాలో నిర్దేశిత ఆయిల్‌ పామ్‌ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ విపి.గౌతమ్‌ తెలిపారు. ఐడివోసి కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్‌ పామ్‌సాగుపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. 2023 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటాలని లక్ష్యంగా చెప్పారు. జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకుగాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతుల భూముల్లో ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేసినట్లు వివరించారు. ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసేందుకు నీటివసతి, విద్యుత్‌ సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ఆయిల్‌ పామ్‌ పంటల సాగుతో లాభాలు, సబ్సిడీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు. జిల్లాలో 40 శాతానికి పైగా ఎస్సి, ఎస్టీ రైతులు ఉన్నారని, ఆయిల్‌ పామ్‌ సాగుపై వీరిలో చైతన్యం తేవాలన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిం చాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఉద్యానవన సహాయ సంచాలకులు కె.అనిత, ఉద్యానవన అధికారులు జి.సందీప్‌ కుమార్‌, జి.నగేష్‌, ఏ.వేణు, పి.అపర్ణ, కె.మీనాక్షి, ఎంఐ ఇంజనీర్‌ పి.నాగమణి, టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ డివిజనల్‌ అధికారి ఏ.బాలకృష్ణ, గోద్రెజ్‌ కంపెనీ ఏరియా మేనేజర్‌ రామకృష్ణ, ఫీల్డ్‌ అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లకు సన్మానం
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో ఉత్తమ సేవలు అందించిన రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్‌ ప్రసాద్‌, ఏఈఈ విశ్వనాథ్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ బాధ్యులను జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ఐడిఒసి సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా సత్కరించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న దానికంటే త్వరగా పూర్తి చేశారని, వారి సేవలను గుర్తించి సత్కరించినట్లు తెలిపారు. నిర్మాణ కాలంలో ఇల్లు, కుటుంబం విడిచి పనిలో నిమగమయ్యారని తెలిపారు. 3 - 4 జనరేషన్‌ లకు ఉపయోగపడే భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారని అన్నారు. కలెక్టర్‌ సత్కరించిన వారిలో రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్‌ ప్రసాద్‌, ఏఈఈ విశ్వనాథ్‌ తో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ డైరెక్టర్‌ రంగయ్య, సైట్‌ ఇంజనీర్లు జగదీష్‌, వెంకటేష్‌, శ్రీనివాస్‌, భాను, గోల్కొండ ఫర్నీచర్‌ కాంట్రాక్టర్‌ ప్రశాంత్‌ ఉన్నారు.
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, సోమవారం ఐడిఓసి లో జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌, జిల్లా అధికారులు మౌనం పాటించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకొని, వారి జీవితాలలో స్ఫూర్తి పొందాలని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, డిఆర్వో శిరీష, అధికారులు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాములోరి కల్యాణంలో రవిచంద్ర
సీపీఐ(ఎం)నాయకులు వల్లభినేని మాధవరావు మృతి
మిషన్‌ భగీ'వృథా'..!
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగం
ప్రజల్లో చైతన్యం నింపిన జన చైతన్య యాత్ర
చినుకుపడితే..అంధకారమే
ఖానాపురం పంచాయతీకి మూడు జాతీయ అవార్డులు
4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
కల్యాణం.. కమణీయం
ప్రయివేటు టీచర్లపై... అడ్మిషన్ల కత్తి
పదిలో పది పాయింట్లు లక్ష్యం
బీసీ కులగణన చేపట్టాలి
పర్యావరణ ప్రేమికుడు నిత్య సేవకుడు గోళ్ళ భూపతిరావు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా : జీఎం
నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌

తాజా వార్తలు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.