Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎందుకంత తొందర? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 25,2022

ఎందుకంత తొందర?

- 24 గంటలు కూడా గడవకముందే నియామకం ఎలా చేశారు?
- సీఈసీ నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన రాజ్యాంగ ధర్మాసనం : తీర్పు రిజర్వ్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్‌ మాజీ అధికారి అరుణ్‌ గోయల్‌ నియామకం మెరుపువేగంతో ఎందుకు నియమించాల్సి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి ప్రస్తుత వ్యవస్థ సరికాదనీ, కొలీజియం వంటి వ్యవస్థను, స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కూడా విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ అరు రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రారు, జస్టిస్‌ సిటి రవి కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌. వెంకటరమణి సమర్పించారు.
నలుగురిలో చిన్నవాడిని ఎలా నియమించారు?
పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ అరుణ్‌ గోయల్‌ నియామకాన్ని ఒక్కరోజులోనే నోటిఫై చేశారని తెలిపారు. 'ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాన్ని ప్రశ్నించటం లేదు. వాస్తవానికి ఆయన అకడమిక్‌ పరంగా అద్భుతమైనవారు. కానీ నియామక ప్రక్రియ గురించి మేం ఆందోళన చెందుతున్నాం. గోయల్‌ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్‌ మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంట్‌ ఎలా జరిగింది. మేం ఈ పిటిషన్‌ను నవంబర్‌ 18న విచారించాం. అదే రోజు ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి న్యాయశాఖ పంపించింది. అదే రోజున గోయల్‌ పేరును ప్రధాని సిఫార్సు చేశారు. ఎందుకు ఈ అత్యవసరం? గోయల్‌ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? పార్లమెంట్‌ ఒక్కరోజులో బిల్లులు పాస్‌ చేయడంతో మనస్తాపం చెందాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ కూడా అదే చేస్తోంది. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే వారిలో చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఆయనను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?' అని ధర్మాసనం ప్రశ్నించింది.
సూపర్‌ ఫాస్ట్‌గా నియామకం
మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందనీ, మే 15 నుంచి నవంబర్‌ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలని ఏజి ఆర్‌.వెంకటరమణిని జస్టిస్‌ అజరు రస్తోగి ప్రశ్నించారు. మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నామనీ, అంతేతప్ప తాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అపాయింట్‌మెంట్‌ ఒకే రోజు సూపర్‌ ఫాస్ట్‌ చేయడానికి ప్రభుత్వానికి ఏం అవసరమొచ్చింది? అని ప్రశ్నించింది. ''నియామకానికి అదే రోజు ప్రక్రియ, అదే రోజు క్లియరెన్స్‌, అదే రోజు నోటిఫైడ్‌, అదే రోజు అపాయింట్‌మెంట్‌ చేశారు. నియామక ఫైల్‌ 24 గంటల కూడా తిరగలేదు. మెరుపు వేగంతో వెళ్లింది' అని ధర్మాసనం పేర్కొంది.
నాలుగు పేర్లు షార్ట్‌లిస్ట్‌ చేయడానికి ప్రమాణాలేంటీ?
అయితే ఎన్నికల కమిషనర్లందరినీ త్వరితగతిన ప్రక్రియతో నియమిస్తారని ఏజీ ఆర్‌.వెంకటరమణి పేర్కొన్నారు. సాధారణంగా ఈ ప్రక్రియ మూడు రోజుల కంటే ఎక్కవ ఉండదని ఆయన వివరించారు. ఏజీగా తన సంప్రదింపుల వల్ల నియామకం కూడా వేగంగా జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి ఆమోదం కోసం ప్రధాన మంత్రికి సిఫార్సు చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేయడం వెనుక ఉన్న ప్రమాణాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ షార్ట్‌లిస్ట్‌ చేయడానికి సీనియరిటీ, రిటైర్‌మెంట్‌, పదవీకాలం వంటి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఉన్నాయని తెలిపారు. కనుక నియమాకం అయిన వ్యక్తి కనీసం ఆరేండ్లు ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని చెప్పారు. అయితే షార్ట్‌లిస్ట్‌ చేసిన నాలుగు పేర్లలో ఎన్నికల కమిషనర్‌గా ఆరేండ్లు కూడా ఉండని పేర్లను కూడా ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఇది సీఈసీ అండ్‌ ఈసీ (సర్వీస్‌ పరిస్థితులు) చట్టం-1991లోని సెక్షన్‌ 6ని ఉల్లంఘిస్తోందని అన్నారు. 'ఏజీ, మీరు ఇటీవలి నియమితులైన వ్యక్తితో ఒకే కేటగిరిలో ఇతర అధికారులు లేరని చెప్పారు. అయితే అదే కేడర్‌ నుండి అనేక మంది పేర్లు ఉన్నాయి. మేము జాబితాను చూశాం. ఈ పేర్లను ఎలా తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం'అని ధర్మాసనం పేర్కొంది. దీనికి ఏజీ స్పందిస్తూ బ్యాచ్‌ ఒక కొలమానమనీ, పుట్టిన తేదీ ఒకటి, బ్యాచ్‌ నుంచి సీనియారిటీ మరొకటి అని పేర్కొన్నారు. డీఓపీటీ డేటాబేస్‌ నుంచే నలుగురి పేర్లను తీసుకున్నారని తెలిపారు.
ఒకనొక సమయంలో ఏజి ఆర్‌.వెంకటరమణి సహనం కోల్పోయి, నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయొద్దంటూ ధర్మాసనాన్ని పేర్కొన్నారు. ఏజీ వాదిస్తుండగా సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా, ఏజీ తీవ్రంగా స్పందించారు. దయచేసి మీరు కాసేపు నోరు మూయండి అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాసేపటికి జస్టిస్‌ అజరు రస్తోగి జోక్యం చేసుకొని, మీరు (ఏజీని ఉద్దేశించి) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీరు ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తీర్పు రిజర్వ్‌
ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌ చేసినట్టు తెలిపింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇచ్చింది. సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న దానిపై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

తాజా వార్తలు

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.