Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇప్పుడున్నది.. ఉపాధి రహిత వృద్ధి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

ఇప్పుడున్నది.. ఉపాధి రహిత వృద్ధి

- కనీస ఆదాయ భద్రత లేకుండా సంక్షోభం పోదు : ఆర్థిక నిపుణులు
- డిసెంబర్‌ తర్వాత ఆగిపోనున్న ఉచిత బియ్యం !
- నగదు బదిలీతో 60శాతం జనాభాకు లబ్ది చేకూరుతుంది..
- యువతలో 19శాతం నిరుద్యోగులే..
- పీఎం కిసాన్‌తో భూస్వాములకే లబ్ది జరుగుతోంది..
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం తర్వాత పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో వృద్ధి సాధించిందని ప్రధాని మోడీ సహా, బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కోట్లాది కుటుంబాలకు ఉపాధి పోయింది. దీనినే 'ఉపాధి రహిత వృద్ధి'గా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్లే మన ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘకాలంగా వేతనాల్లో కోత, ఉద్యోగాల్లో కోత కొనసాగుతోంది. మరోవైపు అధిక ధరలు సామాన్యుడ్ని తినేస్తున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా కేవలం 5 కిలోల ఉచిత బియ్యం విదిలించి మోడీ సర్కార్‌ చేతులు దులుపుకుంది. అధికారంలోకి రాకముందు నగదు బదిలీ అంటూ ఊదరగొట్టిన బీజేపీ నాయకులు..ఇప్పుడు సంక్షోభ సమయాన ఆ మాట ఎత్తటం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పెరిగిందంటూ ప్రజల సమస్యలను తప్పుదారి పట్టిస్తున్నారు. భారతీయ సమాజాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయని, సగటు కుటుంబం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే కనీస ఆదాయ భద్రత, నగదు బదిలీ చేపట్టడం ఒక్కటే పరిష్కారమని పాలకులకు సూచిస్తున్నారు.
రూ.57వేల కోట్లు ఇవ్వలేరా?
             పీఎం కిసాన్‌ కింద మోడీ సర్కార్‌ చేపట్టిన నగదు బదిలీ కొద్ది మంది ధనిక రైతులకే లబ్ది చేకూరుతోందన్న విమర్శలున్నాయి. రూ.6వేలను మూడు విడుతలగా లబ్దిదారులకు కేంద్రం అందజేస్తోంది. పీఎం కిసాన్‌ అందుకోని పేద రైతులు, రైతు కూలీలు ఎంతోమంది ఉన్నారు. వీరిని లెక్కలోకి తీసుకొని నగదు బదిలీ చేపట్టాల్సి ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పీఎం-కిసాన్‌ను అమలుజేస్తే..దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురికి లబ్దిచేకూరుతుందని నిపుణులు తెలిపారు. నగదు బదిలీకి అర్హులైన కుటుంబాలు 10.9కోట్లు ఉంటాయని ఆర్థిక నిపుణులు ఒక నమూనాను కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. సుమారుగా రూ.57వేల కోట్లతో వీరందరికీ అత్యంత తక్కువ మొత్తంతో నగదు బదిలీ చేపట్టవచ్చునని చెబుతున్నారు. దేశంలోని 60.69శాతం జనాభా ఈ పథకంతో లబ్దిపొందుతుందని ఆర్థిక నిపుణులు గణాంకాలతో సహా కొన్ని నమూనాలను సిద్ధం చేశారు.
అప్పుల్లో కూరుకుపోయారు..
             కరోనా సంక్షోభం దెబ్బ నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. అప్పులు చేసి, ఇంట్లో ఉన్నది అమ్మేసి..పిల్లల చదువులు మాన్పించి..ఆయా కుటుంబాలు కాలానికి ఎదురీ దుతున్నాయి. సంక్షోభం నాటి పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య మార్కెట్లు కాస్త తేరుకు న్నాయి. ధనవంతులు, బడా కార్పొరేట్లకు పాలకుల నుంచి మద్దతు లభించటంతో వారిపై కరోనా సంక్షోభ ప్రభావం పెద్దగా ఏమీ లేదు. వారి ఆర్థిక నిర్వహణకు బ్యాంకుల నుంచి మంజూరైన భారీ రుణాలూ ఒక కారణం. కానీ..పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయివేటు అప్పులే దిక్కయ్యాయి. అసంఘటిత రంగంలో భద్రతలేని ఉద్యోగాలు చేసు కుంటూ రోజులు వెళ్లదీస్తున్నాయి.
రైతు కూలీలు, చిన్న సన్నకారు రైతులను నగదు బదిలీ పరిధిలోకి తీసుకురాకపోతే ఈ సమాజం నిలబడలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో దూసుకెళ్తోన్న నిరుద్యోగం, అధిక ధరల్ని పరిష్కరిం చడానికి దోహదపడుతుందని సూచిస్తున్నారు.
నగదు బదిలీ చేపట్టాలి..
             సంక్షోభం తీవ్రతను తెలియజేసే సాధారణ సూచిక 'ప్రజల కొనుగోలు శక్తి'. ఇది గణనీయంగా దెబ్బతిన్నదని, ఇప్పటికీ ఇంకా కోలుకోలేదని ప్రభుత్వ ఏజెన్సీల గణాంకాలే చెబుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే ఆహార ధరల సూచిక (గ్రామీణ, పట్టణ)లో పెరుగుదల 8.6శాతం. ఇక నిరుద్యోగంపై పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే లెక్కల ప్రకారం,పట్టణ నిరుద్యోగరేటు 7.6శాతం (అన్ని వయస్సులవారివీ)గా ఉంది. యువతలో (15- 29ఏండ్లు) 19శాతానికి చేరుకుంది. ఇదే సమయం లో ఆర్థిక వ్యవస్థ పరిమాణమూ పెరిగింది. దీనిని ఉపాధిరహిత వృద్ధిగా ఆర్థిక నిపుణులు పిలుస్తున్నా రు. ఈ ఏడాది డిసెంబర్‌తో ఉచిత బియ్యం పంపిణీ కూడా ఆగిపోతే పేద కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి వారి బ్యాంక్‌ ఖాతాలో నగదు జమచేయాలని, తద్వారా కోట్లాది కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ

తాజా వార్తలు

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.