Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిమాచల్‌లో కాంగ్రెస్‌ గుజరాత్‌లో బీజేపీ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

హిమాచల్‌లో కాంగ్రెస్‌ గుజరాత్‌లో బీజేపీ

న్యూఢిల్లీ : అధికారంలో ఉండి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెండు రోజుల క్రితం ఓటమి పాలైన బీజేపీ హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అదే బాట పట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ప్రజానీకం బీజేపీని తిరస్కరించారు. గురువారం నాడు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పొయింది. ముందునుండి ఊహించినట్టుగానే గుజరాత్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు కూడా పెరిగాయి. స్వరాష్ట్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు, హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం నాడే వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కమలదళానికి తీవ్ర భంగపాటు ఎదురైంది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, వాటిలో ఒక లోక్‌సభతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను ప్రతిపక్షాలు కైవసం చేసుకున్నాయి. కేవలం రెండు శాసనసభ స్థానాల్లోనే బీజేపీ గెలుపొందింది. అయితే, బీజేపీతో పాటు కార్పొరేట్‌ మీడియా కూడా గుజరాత్‌ గెలుపునే భారీగా ప్రచారం చేస్తూ మిగిలిన ఫలితాలను ప్రజల దృష్టికి రాకుండా చేసే విన్యాసాన్ని ప్రారంభించాయి.
హిమాచల్‌లో ఆరు శాతం ఓట్లు కోల్పోయిన బీజేపీ
బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఆరుశాతం ఓట్లను కోల్పోయింది. 60 స్థానాలున్న ఈ రాష్ట్ర శాసనసభకు 2017లో జరిగిన ఎన్నికల్లో 49.53 శాతం ఓట్లతో 44 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గురువారం నాడు ఫలితాలు వెలువడిన తాజా ఎన్నికల్లో 43 శాతం ఓట్లతో 25 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో 42.32 శాతం ఓట్లతో 21 స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ తాజా ఎన్నికల్లో 43.90 శాతం ఓట్లతో 40 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంమీద కాంగ్రెస్‌కు గత ఎన్నికలతో పోలిస్తే 19 స్థానాలు అదనంగా లభించాయి. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారాన్ని మార్చే అలవాటున్న ఈ రాష్ట్రంలో ఈ సారి రెండవసారి కూడా తామే గెలుస్తామని బీజేపీ ప్రకటించింది. మోడీ-అమిత్‌షా ధ్వయం స్వయంగా ప్రచారంలోకి దిగి డబుల్‌ ఇంజన్‌ నినాదాన్ని ఇచ్చారు. మరోవైపు సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మృతి చెందడంతో కాంగ్రెస్‌ పార్టీని నాయకత్వ సమస్య వెంటాడింది. అయినా, ఒక వ్యూహం ప్రకారం ప్రచారంచేయడంతో పాటు, స్థానిక అంశాలను, సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ విజయధుంధుభి మోగించింది. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ ఇక్కడ ప్రచారానికి రాకపోవడంతో ప్రియాంకగాంధీ ముమ్మరంగా పర్యటించారు. ఇక్కడ తొలిసారి పోటీ చేసిన ఆప్‌ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు.
గుజరాత్‌లో ఆప్‌తో బీజేపీకి లబ్ది
గుజరాత్‌లో ముందునుంచి ఊహించినట్లుగానే బీజేపీ గెలుపొందింది. నరేంద్రమోడీ, అమిత్‌షాలు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో పాటు, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక వ్యూహం ప్రకారం నిర్వహించిన ప్రచారం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఆప్‌, ఎంఐఎంలు పోటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పనికి వచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీకి 156 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌ 17 స్థానాలకు పరిమితం అయింది. ఆప్‌ ఐదు స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 57 స్థానాలు పెరిగాయి.
కాంగ్రెస్‌ పార్టీ 60 స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్‌కు 15.67 శాతం ఓట్లు తగ్గగా, బీజేపీకి 3.06 శాతం ఓట్లు పెరిగాయి.. సౌరాష్ట్ర-కచ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పూర్తిగా పతనమయ్యింది. ఆప్‌ భారీగా ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్‌ తన సీట్లు, ఓట్లను కోల్పోయింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లో అడుగుపెట్టడంతో బిజెపి గుజరాత్‌ ప్రైడ్‌ (గౌరవం)ను ప్రచారంలోకి తీసుకొచ్చింది. గుజరాత్‌పై బయట వ్యక్తుల ఆధిప్యం సహించకూడాదని ప్రజల్లో చర్చకు తెరలేపింది. దీని ఫలితంగా బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని భావిస్తున్నారు. 1950 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటమి చెందింది.సూరత్‌, తాపి, భరూచ్‌ జిల్లాల్లోని 27 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడాన్ని ఈ ప్రాంతంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో కాంగ్రెస్‌ నేత రఘు శర్మ గుజరాత్‌ ఏఐసీసీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

10:25 AM

మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.