Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జేఎన్‌యూలో రణరంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2023

జేఎన్‌యూలో రణరంగం

- విద్యార్థులపై రాళ్లు..గాజు ముక్కలతో హిందూత్వ శక్తుల దాడి
- బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన అడ్డుకునేందుకు రాత్రంగా కరెంట్‌ కట్‌..
- జామియా మిలియాలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు అరెస్టు
న్యూఢిల్లీ: గుజరాత్‌ 2002నాటి అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా మోడీ సర్కార్‌ అణచివేత చర్యలకు దిగుతోంది. వివిధ వర్సిటీల్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనలను జీర్ణించుకోలేకపోతోంది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో డాక్యుమెంటరీ చూస్తున్న వందలాది మంది విద్యార్థులపైకి రాళ్లు, గాజు ముక్కలతో దాడి జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు ఈదాడికి తెగబడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుండగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు. మంగళవారం రాత్రి డాక్యుమెంటరీ ప్రదర్శనకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం పిలుపునివ్వగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని వర్సిటీ యాజమాన్యం, పోలీసులు బెదిరింపులకు దిగారు. ప్రదర్శన ముగిసిన తర్వాత రాత్రి 10.40 గంటల సమయంలో కమ్యూనిటీ సెంటర్‌ వద్ద గుమికూడిన విద్యార్థులపై రాళ్లదాడి జరిగింది. హాజరైనవారి పైకి పగిలిన అద్దాల్ని విసిరేశారని మీడియాలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. వర్సిటీ యాజమాన్యం మంగళవారం రాత్రంతా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. ప్రధాన గేట్లతో సహా అనేక చోట్ల దారుల్ని పోలీసులు మూసేశారు. అయినప్పటికీ వర్సిటీలో క్యాంపస్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటుచేసిన డాక్యుమెంటరీ ప్రదర్శనకు వందలాది మంది విద్యార్థులు హాజరుకావటం విశేషం.
తమ మొబైల్‌ ఫోన్లలో, ల్యాప్‌ట్యాప్స్‌లో డాక్యుమెంటరీని విద్యార్థులంతా చూశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ ప్రసంగించారు. ''డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఫై, విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారు. అయినా మన కార్యక్రమం ఆగిపోదు'' అని చెప్పారు. ''కార్యక్రమం జరగకుండా వర్సిటీ యాజమాన్యం అడ్డంకులు సృష్టించింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయటం పిరికిచర్య. అన్ని రకాల భావాలపై చర్చించే వేదికగా ఈ వర్సిటీకి పేరుంది. అయితే ఇప్పుడు వర్సిటీ యాజమాన్యం వ్యవహరించిన తీరు విద్యాసంస్థ ప్రతిష్టను దెబ్బతీసింది''అని ఒక విద్యార్థి అన్నారు.
చూడొద్దు..అంటూ నోటీసు
డాక్యుమెంటరీ చూడొద్దు, ప్రదర్శనలో పాల్గొనద్దు..అంటూ సోమవారం నాడు జేఎన్‌యూ యాజమాన్యం విద్యార్థులను బెదిరించింది. జేఎన్‌యూఎస్‌యూ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అనుమతులు లేవని పేర్కొంది. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి కమ్యూనిటీ సెంటర్‌ వద్ద జరిగిన రాళ్లదాడి, గాజుపెంకల దాడి..ఏబీవీపీ కార్యకర్తల పనేనని ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) ఆరోపించింది. దాడి ఘటనను తీవ్రంగా ఖండించింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా గళమెత్తుతారని, ప్రజాస్వామిక గొంతు వినిపిస్తారని ఒక ప్రకటనలో ఏఐఎస్‌ఏ తెలిపింది.
జామియా మిలియా
బుధవారం ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం వర్సిటీ ప్రధాన గేటును మూసేసిన పోలీసులు, విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో గేటు వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఫతేపూర్‌ బేరిలోని క్యాంపస్‌కు 20 కి.మీ దూరంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేయటం ఏంటని 'ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌' (ఏఐఎస్‌ఏ) ప్రశ్నించింది. అరెస్టయిన కార్యకర్తల మొబైల్‌ ఫోన్లను పోలీసులు లాక్కున్నారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తు న్నామని ఏఐఎస్‌ఏ ఒక ప్రకటన జారీచేసింది. అరెస్టు చేసిన విద్యార్థుల్ని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో బుధవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో డాక్యు మెంటరీ ప్రదర్శన చేపట్టగా, డాక్యుమెంటరీ ప్రసారమవుతుం డగా...మధ్యలో పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని నిలిపివేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌
సురక్షిత నీరు రావట్లేదు.
సిసోడియా కస్టడీ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ దురహంకారమిది..

తాజా వార్తలు

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.